Asianet News TeluguAsianet News Telugu

పార్సిల్ ఓపెన్ చేస్తే... బుసలుకొట్టే పాము ఉంది

విజయవాడకు చెందిన ముత్తుకుమరన్ అనే వ్యక్తి ప్రస్తుతం ఒడిషాలోని మయూర్ భంజ్ లోని రైరంగాపూర్ లో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇంట్లోకి అవసరమయ్యే కొన్ని వస్తువులను ఓ కొరియర్ కంపెనీలో పార్శిల్ బుక్ చఏశఆడు.  ఆ కొరియర్ ఇటీవల ఇంటికి చేరింది. ఆ వస్తువును చూద్దామని పార్శిల్ ఓపెన్ చేశాడు.

Courier company delivers snake in parcel to man in Odisha
Author
Hyderabad, First Published Aug 26, 2019, 12:58 PM IST

ఓ వ్యక్తి...ఇంట్లోకి అవసరమైన వస్తువులను ఓ కొరియర్ కంపెనీలో పార్శిల్ బుక్ చేశాడు.  ఆ పార్సిల్ ఇంటికి కూడా వచ్చింది. ఆర్డర్ చేసిన వస్తువు ఎలా ఉందో అని ఆశగా ఓపెన్ చేస్తే... అందులో పాము ఉండటం విశేషం. దానిని చూసి ఆ వ్యక్తి  షాకయ్యాడు. తర్వత తేరుకొని పాముని స్నేక్ క్యాచర్స్ కి అప్పగించాడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన ముత్తుకుమరన్ అనే వ్యక్తి ప్రస్తుతం ఒడిషాలోని మయూర్ భంజ్ లోని రైరంగాపూర్ లో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇంట్లోకి అవసరమయ్యే కొన్ని వస్తువులను ఓ కొరియర్ కంపెనీలో పార్శిల్ బుక్ చఏశఆడు.  ఆ కొరియర్ ఇటీవల ఇంటికి చేరింది. ఆ వస్తువును చూద్దామని పార్శిల్ ఓపెన్ చేశాడు.

ఆ పార్శిల్ లో అతను కొన్న వస్తువుతో పాటు బుసలు కొడుతున్న పాము కూడా ఉంటం విశేషం. ముందు దానిని చూసి బయపడ్డాడు. తర్వాత వెంటనే ఈ విషయాన్ని అటవీ శాఖ , స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించాడు. వాళ్లు వచ్చి  పామును పట్టుకొని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు. పదిహేను రోజుల కిందట తాను ప్రైవేట్‌ కొరియర్‌ ఏజెన్సీ నుంచి పార్సిల్‌ను బుక్‌ చేశానని ముత్తుకుమరన్‌ తెలిపారు. ఈనెల 9న గుంటూరు నుంచి ఈ పార్సిల్‌ తనకు పంపారని చెప్పారు. గృహోపకరణాలతో కూడిన ఈ పార్సిల్‌ను విప్పిచూస్తుండగా అందులో​ పాము కనిపించడంతో షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఒడిషాకు పార్సిల్‌ను తరలించే క్రమంలో పాము ఇందులోకి చేరిఉంటుందని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios