Asianet News TeluguAsianet News Telugu

Coronavirus: కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదు.. నిపుణుల హెచ్చరికలు

Coronavirus: కరోనా వైరస్ మహమ్మారి ఇంకా ముగిసిపోలేద‌ని వైద్య నిపుణులు, ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. కొత్త వేరియంట్లు వెలుగుచూడ‌టంతో పాటు ప‌లు దేశాల్లో ఆందోళ‌న‌క‌ర స్థాయిలో కోవిడ్‌-19 కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌టంతో మాస్కులు ధ‌రించ‌డం, క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించ‌డం, త‌ప్ప‌నిస‌రిగా జాగ్రత్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. 
 

Coronavirus pandemic not over yet: Experts
Author
Hyderabad, First Published Apr 21, 2022, 12:56 PM IST

Coronavirus: చైనా, ద‌క్షిణ కొరియా, ప‌లు యూర‌ప్ దేశాల్లో క‌రోనా వైర‌స్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు కొత్త వేరియంట్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. భార‌త్ లోనూ గ‌త కొన్ని రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా వైర‌స్ కొత్త కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దేశ రాజ‌ధాని ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కోవిడ్-19 ప్ర‌భావం పెరుగుతున్న‌ద‌ని ప్ర‌స్తుతం న‌మోద‌వుతున్న కేసుల గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ స‌హా దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు క్రమంగా పెరగడం.. కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌లను జన్యు శాస్త్రవేత్తలు వేగంగా గుర్తించ‌డం కోవిడ్ మహమ్మారి ఇంకా ముగియలేదనడానికి స్పష్టమైన సంకేతంగా క‌నిపిస్తోంది. సీనియర్ జీవశాస్త్రవేత్తలు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్‌లు, వైద్య నిపుణులు సైతం కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి ఇంకా పోలేద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఫేస్ మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక దూరాన్ని పాటించ‌డం, క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. 

ర‌ద్దీగా ఉండే ప్రాంతాలు, వెంటిలేష‌న్ త‌క్కువ‌గా ఉండే ప్రాంతాల్లో కోవిడ్‌-19 మ‌ళ్లీ విజృంభించే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయ‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. “ప్ర‌స్తుత‌ సమయంలో మహమ్మారి ఇంకా ముగియనందున మేము విశ్రాంతి తీసుకోలేము. సాధారణ ప్రజలలో హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నందున మేము ఖచ్చితంగా బలమైన స్థితిలో ఉన్నాము. అయినప్పటికీ, ఫేస్ మాస్క్‌లను తొలగించడానికి ఇది సమయం కాదు, ఎందుకంటే వృద్ధులు మరియు రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు ఇప్పటికీ రక్షణ అవసరం”అని సీనియర్ జీవశాస్త్రవేత్త, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) మాజీ డైరెక్టర్ డాక్టర్ ఆర్‌కే మిశ్రా అన్నారు. 

యూరప్, అమెరికా స‌హా ప‌లు దేశాల్లో గుర్తించిన వేరియంట్లు భార‌త్ లోనూ వెలుగుచూడ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశ‌మ‌ని పేర్కొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల తెలంగాణలోనే కాకుండా భారతదేశం అంతటా సాధారణ ప్రజలలో జనాభా ఆధారిత రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉందనీ, అంటువ్యాధుల కొత్త పెరుగుదలను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని స్పష్టమైన సూచనలు ఉన్నాయ‌న్నారు. కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగినప్పటికీ, భారతీయ జనాభాలో అధిక రోగనిరోధక శక్తి స్థాయిలకు, ఆస్పత్రిలో చేరడానికి దారితీసే వ్యాధి తీవ్రత ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, కోవిడ్-19 మహమ్మారి చురుకుగా కొనసాగుతోందని స్పష్టమైన సూచనలో, కొన్ని రోజుల క్రితం.. US జన్యు శాస్త్రవేత్తల బృందం BA2కు చెందిన స‌బ్-వేరియంట్‌ను నివేదించింది. దీనిని BA 2.12.1 పేర్కొంటున్నారు. ఈ వేరియంట్ కేసులు అమెరికాలో విపరీతంగా పెరుగుతున్నాయి.  BA 2 వేరియంట్‌ను ఇది మించిపోయింది. రాబోయే రోజుల్లో మ‌రింత‌గా పెరిగే అవ‌కాశాలున్నాయ‌ని అక్క‌డి సైంటిస్టులు పేర్కొంటున్నారు. 

ప్రస్తుతం బెంగళూరులోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ సొసైటీ (టిఐజిఎస్) డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ ఆర్‌కే మిశ్రా.. ప్రస్తుతం బూస్టర్ డోస్ తీసుకోవడం, కోవిడ్-19కు తగిన ప్రవర్తనను అనుసరించడం, మాస్క్‌లను ఉపయోగించడం మాత్రమే కరోనావైరస్ ను ఓడించడానికి ఏకైక మార్గమని సూచించారు. ఫేస్ మాస్కులు ధ‌రించ‌డం గురించి ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు అవ‌స‌రం లేకుండా.. ప్ర‌జ‌లంద‌రూ వాటిని ధ‌రిస్తూ.. జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రముంద‌ని నొక్కిచెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios