Congress: దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత భారత జాతీయ కాంగ్రెస్కు గాంధీయేతర అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతవారం జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ ఎంపీ శశిథరూర్ను భారీ మెజార్టీతో ఓడించి ఖర్గే అత్యున్నత పదవిని దక్కించుకున్నారు.
Mallikarjun Kharge: సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే దేశరాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. కొత్త కాంగ్రెస్ అధ్యక్షులు చాలా అనుభవజ్ఞుడనీ, తన కష్టార్జితంతో సాధారణ కార్యకర్త నుంచి ఇంత ఎత్తుకు ఎదిగారని అన్నారు. కాంగ్రెస్కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయనీ, అయితే ఐక్యత, శక్తితో వాటిని ఎదుర్కొనేందుకు గతంలో మాదిరిగానే ముందుకు సాగుతామని చెప్పారు. అత్యున్నత పదవికి ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని అందజేసిన తర్వాత మల్లికార్జున్ ఖర్గే అధికారికంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. ఖర్గే నాయకత్వం ద్వారా కాంగ్రెస్ స్ఫూర్తి పొందుతుందనీ, బలోపేతం అవుతుందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు.
కొత్త కాంగ్రెస్ అధ్యక్షులు చాలా అనుభవజ్ఞుడనీ, సాధారణ కార్యకర్త నుంచి తన కష్టార్జితంతో ఇంత ఎత్తుకు ఎదగడం తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తన కర్తవ్యాన్ని తన శక్తి మేరకు నిర్వర్తించాననీ, ఇప్పుడు ఈ బాధ్యత ఖర్గేకు అప్పగిస్తున్నాననీ, తాను విముక్తి పొందుతున్నానని సోనియా గాంధీ చెప్పారు. "కాంగ్రెస్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. అయితే పూర్తి బలం, ఐక్యతతో మేము ముందుకు సాగాలి.. అందులో విజయం సాధించాలి" అని ఆమె అన్నారు.
మీరు ఇన్ని సంవత్సరాలుగా ఇచ్చిన ప్రేమ, గౌరవం, ఇది నాకు గర్వకారణమైన విషయం. నా చివరి శ్వాస వరకు నేను అనుభూతి చెందుతాను: సోనియా గాంధీ
కాగా, దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత భారత జాతీయ కాంగ్రెస్కు గాంధీయేతర అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతవారం జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ ఎంపీ శశిథరూర్ను భారీ మెజార్టీతో ఓడించి ఖర్గే అత్యున్నత పదవిని దక్కించుకున్నారు. 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర పార్టీకి సారథ్యం వహించిన తొలి వ్యక్తి ఖర్గే. పార్టీ అధినేత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన సోనియాగాంధీ తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టారు.
కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. “ఒక కార్మికుడి కొడుకు, సాధారణ కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ చీఫ్గా బాధ్యతలు చేపట్టడం నాకు ఎమోషనల్ మూమెంట్. ఈ గౌరవం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు'' అని అన్నారు. అలాగే, “నేను 1969లో బ్లాక్ కమిటీ చీఫ్గా ఈ ప్రయాణాన్ని ప్రారంభించాను. ఈ రోజు మీరు ఇంత ఎత్తుకు ఎదిగారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి వారి మార్గనిర్దేశం చేసిన కాంగ్రెస్ పార్టీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం నా అదృష్టం.. గర్వకారణం” అని ఖర్గే అన్నారు.
