శశి థరూర్ vs దిగ్విజయ్ సింగ్ vs అశోక్ గెహ్లాట్.. రసవత్తరంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు !
Congress presidential election : తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ తొలిసారిగా కాంగ్రెస్ అధ్యక్ష బరిలోకి దిగారు. అలాగే, గాంధీ కుటుంబ విధేయులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో హస్తం పార్టీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి.
Tharoor vs Digvijaya Singh vs Gehlot: 22 ఏళ్ల తర్వాత పార్టీ తన మొదటి అధ్యక్ష ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ అగ్ర పదవిని కైవసం చేసుకోవడం మనేది ఆసక్తికర పోటీగా మారింది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షునిగా చేయాలని పెద్ద ఎత్తున ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల నుంచి డిమాండ్ వినిపించినప్పటికీ.. గాంధీయేతరులు ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో పార్టీ పాలిటిక్స్ వేడెక్కాయి. తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ తొలిసారిగా కాంగ్రెస్ అధ్యక్ష బరిలోకి దిగారు. అలాగే, గాంధీ కుటుంబ విధేయులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో హస్తం పార్టీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి.
దిగ్విజయ్ వెనుకు వ్యూహమా?
బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకోనున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మరో రెండు రోజుల్లో నామినేషన్ దాఖలు చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు, రాహుల్ గాంధీ నియకత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రల మధ్య రాజస్థాన్ కాంగ్రెస్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇక్కడ నెలకొన్న సంక్షోభం వల్లే సింగ్ అభ్యర్థిత్వానికి ఆజ్యం పోసిందని పరిణామాలు తెలిసిన వర్గాలు భావిస్తున్నాయి. సచిన్ పైలట్తో తన పోరాటాన్ని వెనుకకు వదిలేసి ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించమని గెహ్లాట్కు చెప్పడానికి ఉద్దేశించిన ఒక ఒత్తిడి వ్యూహం కూడా కావచ్చునని తెలుస్తోంది. పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం.. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి, ఎవరైనా ఎన్నికల్లో పోరాడి గెలవవచ్చు అనే సందేశాన్ని పంపడానికి దిగ్విజయ్ సింగ్ను ఆసరాగా చేసుకున్నారు. అయితే, సింగ్ ఈ పోటీకి ప్రచారం చేయరనీ, ఇదే సమయంలో భారత్ జోడో యాత్ర కోసం పని చేస్తూనే ఉంటారని అభిప్రయపడుతున్నారు.
ముందు అశోక్ గెహ్లాట్ అనుకున్నారు.. కానీ..?
అనూహ్యంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విధేయుల తిరుగుబాటు తర్వాత, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆయనతో విసిగిపోయింది. పలు నివేదికల ప్రకారం గాంధీలు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేయాలనీ, సచిన్ పైలట్కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలని కోరుకున్నారు. కానీ ఆదివారం నాటి సంఘటనల పట్ల అగ్రనాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు గెహ్లాట్ను అధ్యక్ష రేసు నుండి తప్పించాలని కోరుకున్నారని సమాచారం. అయితే, నాటకీయ తిరుగుబాటు గురించి పరిశీలకులు సోనియా గాంధీకి సమర్పించడం, గెహ్లాట్కు క్లీన్ చిట్ ఇవ్వడం వంటి చర్యలతో అయన అధ్యక్ష రేసులో ఉండవచ్చనే ఊహాగానాలకు దారితీసింది.
గురువారం సోనియాతో గెహ్లాట్ సమావేశం
అధ్యక్ష రేసులోకి వచ్చిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. తన ప్రస్తుత పదవిని వదులుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. మూలాల ప్రకారం ఆయన ఎన్నికల్లో గెలిస్తే రెండు పదవులను కొనసాగించాలని ఉద్దేశంలో ఉన్నారు. అయితే, అంతకుముందు పార్టీలో ఒక వ్యక్తి ఒక పోస్ట్ అనే ఉదయ్ పూర్ సమావేశాల్లో చేసిన తీర్మానం గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించడంతో.. రాజస్థాన్ కాంగ్రెస్ లో తిరుగుబాటుకు దారితీశాయి. గెహ్లాట్ టీమ్లోని 82 మంది ఎమ్మెల్యేలు ఆదివారం అర్థరాత్రి హైడ్రామా మధ్య తమ రాజీనామాలను స్పీకర్ కు సమర్పించారు. దీనిని పరిష్కరించడానికి పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది.
దిగ్విజయ సింగ్.. బలాలు, బలహీనతలు
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన దిగ్విజయ్ సింగ్ కు అపారమైన సంస్థాగత, పరిపాలనా అనుభవం ఉంది. ఆయన గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా భావిస్తారు. ఆర్ఎస్ఎస్, హిందుత్వ ఎరగా పేరొందిన ఆయన సంఘ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటానికి నాయకత్వం వహించే స్థితిలో ఉన్నారు. సింగ్ 1993 నుండి 2003 వరకు వరుసగా రెండు సార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచుగా తనను, పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టడం ఆయన బలహీనత కావచ్చు. ఇక ఆయన కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
మొదటి నుంచి శశిథరూర్ తిరుగుబావుట.. ?
వరుసగా మూడు లోక్సభ ఎన్నికల్లో గెలిచిన శశి థరూర్.. తార్కిక, ఆకర్షణీయమైన, స్పష్టమైన విశ్లేషణ రాజకీయ నాయకుడు. మధ్యతరగతిలో మంచి గుర్తింపు ఉంది. థరూర్కు ఐక్యరాజ్యసమితిలో ఉన్నప్పటి నుండి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వుంది. అలాగే, మంత్రిగా పనిచేసినప్పటి నుండి పరిపాలనా అనుభవం కూడా ఉంది. ఇవన్నీ ఆయనకు బలాలుగా ఉన్నాయి. అయితే, ఆయన G-23 ట్యాగ్ నాయకుల కోవకు వస్తారు. G-23 అనేది 23 మంది కాంగ్రెస్ నాయకుల సమూహం. వారు పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం కోసం తమ డిమాండ్లలో గొంతు వినిపించారు. థరూర్కు గాంధీ కుటుంబం నుండి మద్దతు లభించకపోవచ్చు.అలాగే, ఆయన పార్టీలో కొత్త వ్యక్తిగా ఉన్నారు, అంటే 2009లో కాంగ్రెస్లో చేరాడు. అనేక వివాదాలు ఆయన చుట్టూ తిరిగాయి.
కాంగ్రెస్ చీఫ్గా ప్రియాంక గాంధీ వాద్రా?
కుటుంబం నుండి ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయరని గాంధీలు స్పష్టం చేసినప్పటికీ, ఇప్పుడు ప్రియాంక గాంధీ వాద్రాను అత్యున్నత పదవికి పోటీ చేయమని కోరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖాలిక్ ప్రకారం ప్రియాంక వివాహం చేసుకున్నందున, ఆమె ఇకపై గాంధీ కాదు, ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అని పేర్కొన్నారు.