కోవిడ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి: కాంగ్రెస్ విమర్శలకు నడ్డా కౌంటర్
భారత్ ప్రశంసనీయమైన అభివృద్దిని సాధించిన సమయంలో.... ఆ విజయాలను వ్యతిరేకించడానికి ఎగతాళి చేసేందుకు ముందుకు వస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు.
న్యూఢిల్లీ: భారత్ ప్రశంసనీయమైన అభివృద్దిని సాధించిన సమయంలో.... ఆ విజయాలను వ్యతిరేకించడానికి ఎగతాళి చేసేందుకు ముందుకు వస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు.
also read:కరోనాపై వివాదాస్పద వ్యాఖ్యలు: విపక్షాలకు నెటిజన్ల క్లాస్
కాంగ్రెస్ ఎంతగా ఈ విధానాలను వ్యతిరేకిస్తోందో అంతగా ఎక్స్పోజ్ అవుతోందని ఆయన చెప్పారు..కరోనా వైరస్ నిర్మూలన కోసం ఏడాది సమయంలోనే వ్యాక్సిన్ తయారీ కోసం శాస్త్రవేత్తలు కృషి చేశారని ఆయన చెప్పారు. ఈ విషయమై దేశం మొత్తం సంతోషంగా ఉంటే కాంగ్రెస్ , కొన్ని విపక్షాలు ఎగతాళి చేయడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు.
తమ స్వంత విఫలమైన రాజకీయాలు , దుర్మార్గపు ఎజెండాలను మరింతగా పెంచడానికి కాంగ్రెస్ సహా ఇతర విపక్షనాయకులు ప్రజల్లో మనసుల్లో భయాందోళనలు కల్గించే ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇతర సమస్యలపై రాజకీయాలు చేయాలని కోరుతున్నానని ఆయన చెప్పారు. ప్రజల జీవితాలతో ఆడకూడదని ఆయన కోరారు.