నిర్ణయాత్మకమైన విజయం.. హిమాచల్లో హామీలు అమలు చేస్తాం : రాహుల్ గాంధీ
హిమాచల్ ప్రదేశ్లో తమ పార్టీకి నిర్ణయాత్మకమైన విజయం అందించినందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.
హిమాచల్ ఎన్నికల ఫలితాలు 2022: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. హిమాచల్లో కాంగ్రెస్ 40 స్థానాలతో మెజారిటీ మార్క్ను దాటి ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కేవలం 17 స్థానాలకే పరిమితమై.. ప్రతిపక్ష పాత్రను పోషించడానికి సిద్ధమైంది. హిమాచల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత పార్టీ అధినేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. ఈ అపూర్వ విజయం అందించిన హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదిక స్పందిస్తూ... “ఈ నిర్ణయాత్మక విజయం అందించిన హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం కోసం మీ కృషి చెందిన, అంకిత భావంతో పని చేసిన కార్యకర్తలకు శుభాకాంక్షలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని వీలైనంత త్వరగా నెరవేరుస్తామని మరోసారి హామీ ఇస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
మరోవైపు..రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 91వ రోజుకు చేరుకుంది. గుజరాత్ లో కాంగ్రెస్ ఘోర ఓటమి ఎదురైనప్పటికీ హిమాచల్ ప్రదేశ్ లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్ లో స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. ఆ పార్టీ రాష్ట్ర నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవికి బీజేపీ సీఎం జైరాం ఠాకూర్ రాజీనామా చేశారు.
హిమాచల్లో ఆ ఆనవాయితీ కొనసాగింది
మరోవైపు.. అసెంబ్లీలో ఓటమిని అంగీకరిస్తూనే హిమాచల్ సీఎం జైరాం ఠాకూర్ కాంగ్రెస్కు అభినందనలు తెలిపారు. గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలిపారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా ఆ సంప్రదాయం కొనసాగింది. ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చడం హిమాచల్లో ఆనవాయితీగా ఉంది, ఈసారి కూడా అదే జరిగింది. హిమాచల్లో కాంగ్రెస్ దాదాపు 44 శాతం ఓట్లతో పూర్తి మెజారిటీ సాధించింది.
పార్టీ గెలుపుపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఏమన్నారు?
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఘనతను ప్రియాంక గాంధీకి ఇచ్చారని, మా జట్టు మెరుగైన పనితీరు కనబరిచిందని,మెరుగైన పని చేసిందని అన్నారు. రాహుల్ గాంధీ భారత పర్యటన ప్రభావం హిమాచల్ ప్రదేశ్ లోనూ కనిపిస్తోందన్నారు. రానున్న కాలంలో లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహించి అందులో ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తామని ఖర్గే తెలిపారు.