BS Yediyurappa: "బీజేపీకి దమ్ముంటే.... ఆయనను సీఎం అభ్యర్థిగా నిలబెట్టాలి"
BS Yediyurappa: 2023లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడానికే బీజేపీ పార్లమెంటరీ బోర్డులోకి మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పను తీసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీకి దమ్ముంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీని కాంగ్రెస్ పార్టీ నేత ఎంబీ పాటిల్ సవాల్ చేశారు.
BS Yediyurappa: వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడానికే మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్పను బీజేపీ పార్లమెంటరీ బోర్డులోకి తీసుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబి పాటిల్ ఆరోపించారు. బిజెపి తన ఉనికిని కాపాడుకోవడానికి యెడియూరప్పను ఉపయోగించుకుంటోందని, బీజేపీకి దమ్ముంటే.. అసెంబ్లి ఎన్నికల్లో యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని సవాల్ విసిరారు. యడ్యూరప్ప వయసు కారణంగానే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే.. యడ్యూరప్పను బీజేపీ పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడిగా నియమించినప్పుడు ఆయన వయస్సు కారణం కాదా అని ప్రశ్నించారు.
యడ్యూరప్పకు సమూచిత స్థానం కల్పించడం వల్ల బీజేపీ అధిష్ఠానం ప్రయోజనం పొందాలని భావిస్తుంది. ఆయన లింగాయత్ ఓట్లను ఆకర్షించే అవకాశాలపై ప్రభావం చూపుతుందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. లింగాయత్ సామాజిక వర్గ నేత యెడియూరప్పను ఎన్నికల ప్రయోజనం కోసం వినియోగించుకుంటున్న అధికార పార్టీ ఆటను ఈ సమాజం పూర్తిగా అర్థం చేసుకుంటోందని, ఎన్నికల కోసమే ఇలా చేశారన్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా లింగాయత్లే. ప్రభావవంతమైన లింగాయత్ కమ్యూనిటీ బిజెపికి భారీ ఓటు బ్యాంకు. యడియూరప్ప, పాటిల్ ఈ వర్గానికి చెందిన నేతలే కావడం గమనార్హం.
ఇది బిజెపి అంతర్గత విషయమే అయినప్పటికీ, యడ్యూరప్పకు 75 ఏళ్లు దాటిపోయాయని కారణంగా (పదవి నుండి) రాజకీయాల నుంచి తప్పించారు. కానీ, ఇప్పుడు ఆయనను బీజేపీ అధిష్టానం విధాన నిర్ణాయక కమిటీల్లో చోటు కల్పించారు. బీజేపీకి యడ్యూరప్ప పట్ల ప్రత్యేక ప్రేమ ఉందనీ, ఈ రాష్ట్రంలో అంతరించిపోయే దశలో ఉన్న పార్టీకి ప్రాణం పోయడానికి చేసిన ప్రయత్నం మాత్రమేననీ ఎంబీ పాటిల్ అన్నారు.
రాష్ట్రంలో వస్తున్న సర్వేలు, ప్రజాభిప్రాయం, మీడియా అభిప్రాయం, ఇటీవలి పరిణామాలు, ప్రభుత్వం నడుస్తున్న తీరు, సిద్ధరామయ్య 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం వంటి అంశాలు బీజేపీని ఆందోళనకు గురిచేశాయన్నారు. ఇది యడ్యూరప్ప కోసమో, ఆయనకు గౌరవం ఇవ్వడమో చేయలేదని, బీజేపీ ఉనికిని కాపాడేందుకు వచ్చే ఎన్నికలకు వాడుకుంటున్నారని అన్నారు. యడ్యూరప్పను పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీకి నియమిస్తున్నట్లు బీజేపీ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రజలు మూర్ఖులు కాదని, వాస్తవాన్ని వారు అర్థం చేసుకుంటారని పాటిల్ అన్నారు. ‘‘యడ్యూరప్పపై బీజేపీ అంత ప్రేమ, గౌరవం ఉంటే.. ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారు?... మరోసారి ఆయన్ను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించి.. తామే పార్టీ చేస్తామని బీజేపీ ప్రకటించిందని ఆయన అన్నారు. లింగాయత్ల ఓట్లను బీజేపీకి చేర్చే ప్రయత్నమా అని అడిగినప్పుడు, "యడ్యూరప్ప ఈ వర్గానికి పెద్ద నాయకుడనహం లేదు, అయితే లింగాయత్లు మూర్ఖులు కాదు, వారికి నిజం తెలుసు" అని ఆయన అన్నారు.