Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ 70 ఏళ్ల పాటు రాజ్యాంగాన్ని కాపాడితే.. బీజేపీ మ‌తం, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తోందంటూ ఖర్గే ఫైర్

New Delhi: 70 ఏళ్ల పాటు రాజ్యాంగాన్ని కాపాడింది కాంగ్రెస్ అని ఆ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే అన్నారు. అయితే, ప్ర‌స్తుతం బీజేపీ ప్ర‌భుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని విమ‌ర్శించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర గురించి ఖర్గే మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్ర పోరాటానికి బీజేపీ ఎలాంటి సహకారం అందించలేదనీ, ఆ పార్టీ వారు ఎవరూ జైలుకు వెళ్లలేదన్నారు.
 

Congress has protected the Constitution for 70 years; Mallikarjun Kharge fires BJP for doing religion and divisive politics
Author
First Published Jan 6, 2023, 2:13 PM IST

Congress President Mallikarjun Kharge: కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే మ‌రోసారి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. భార‌త స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర ఏం లేద‌న్నారు. బీజేపీ వారు ఏవ‌రు కూడా జైలుకు కూడా వెళ్ల‌లేద‌ని పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో భార‌త స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం కాంగ్రెస్ అన్ని త్యాగ‌ల‌ను చేసింద‌ని అన్నారు. మతం పేరుతో సమాజాన్ని విభజించి పేదలను అణిచివేసేందుకు అధికార పార్టీ పనిచేస్తోందని బీజేపీపై మండిపడ్డారు.

గత 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్  ఖర్గే అన్నారు. 'గత 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రధాని మోడీ ఎప్పుడూ అడుగుతూనే ఉన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడింద‌నీ, అందుకే ఆయనలాంటి వ్యక్తి ప్రధాని కాగలడనీ, నాలాంటి పేదవాడి కుమారుడు ఏఐసీసీ అధ్యక్షుడవుతారని నేను ఆయనకు చెప్పాలనుకుంటున్నాను' అని కాంగ్రెస్ చీఫ్ ఖ‌ర్గే అన్నారు. ఆయ‌న‌ బీహార్ లోని బంకా జిల్లాలో 'భారత్ జోడో యాత్ర'ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. భార‌త స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర గురించి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర‌ పోరాటంలో బీజేపీ ఎటువంటి సహకారం అందించలేదనీ, దాని కార్యకర్తలు ఎవరూ జైలుకు వెళ్లలేదని ఖర్గే అన్నారు.

బీజేపీ దేశానికి స్వాతంత్య్రం ఇవ్వలేదనీ, దాని కార్యకర్తలు ఎవరూ జైలుకు వెళ్లలేదని అన్నారు. అయితే, కాంగ్రెస్ భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకువ‌చ్చింద‌నీ, దేశ అభివృద్ధికి ఎన్నో త్యాగాల‌ను చేసింద‌ని ఖ‌ర్గే అన్నారు. మతం పేరుతో సమాజాన్ని విభజించి పేదలను అణిచివేసేందుకు అధికార పార్టీ పనిచేస్తోందని బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ విభజన రాజకీయాలు మాత్రమే చేస్తుందని అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీలను ప్రధాని మోడీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. 

"మతం పేరుతో ప్రజలు ఒకరిపై ఒకరు పోరాడేలా చేయడం బీజేపీ పని. వారు (బీజేపీ) విభజన రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. ఈ రోజు దేశంలో ఏం  అభివృద్ది జరుగుతున్నా అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, బీజేపీ కాదు. దేశంలో లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయి, కానీ మోడీ ప్రభుత్వం దేశంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు" అని ఖర్గే బంకాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ అన్నారు. "ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి విదేశాల నుండి నల్లధనాన్ని దేశానికి తీసుకువస్తానని ప్రధాని మోడీ ఇంతకు ముందు చెప్పారు. దేశం మొత్తం నేడు నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో ప్రభావితమైంది. ఆయ‌న ఇచ్చిన వాగ్దానాల‌ను నిలబెట్టుకోలేదు" అని ఖ‌ర్గే విమ‌ర్శించారు. 

కాగా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వ‌య‌నాడ్ పార్ల‌మెంట్ స‌భ్యులు రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్ లో పాద యాత్రను ముగించుకుని గురువారం హర్యానాలో ప్రవేశించింది. గురువారం హర్యానాలో తిరిగి ప్రవేశించిన యాత్ర జనవరి 5 మరియు 10 మధ్య రాష్ట్రంలోని నాలుగు జిల్లాల గుండా వెళుతుంది. జనవరి 5 సాయంత్రం ఉత్తరప్రదేశ్ నుండి పానిపట్ జిల్లాలోని సనౌలీ ఖుర్ద్ గ్రామం గుండా యాత్ర హర్యానాలోకి ప్రవేశించింది. యాత్ర శుక్రవారం ఉదయం సనోలి-పానిపట్ రోడ్డు నుండి తిరిగి ప్రారంభమైంది. మధ్యాహ్నం పానిపట్‌లో బహిరంగ సభ జరుగుతుంది. ఇందులో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios