సైబర్ క్రైమ్, మహిళల భద్రత, డ్రగ్స్ అక్రమ రవాణాపై అమిత్ షా అధ్యక్షతన చింతన్ శివిర్
Chintan Shivir: ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన ‘విజన్ 2047’, ‘పంచప్రాన్’ అమలుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘చింతన్ శివిర్’కు అధ్యక్షత వహిస్తారని అధికారిక ప్రకటన తెలిపింది. మోడీ అక్టోబర్ 28న 'చింతన్ శివిర్'లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు.
NEW DELHI: సైబర్ క్రైమ్, మహిళల భద్రత, డ్రగ్స్ అక్రమ రవాణాపై అమిత్ షా అధ్యక్షతన "చింతన్ శివిర్" జరగనుంది. అక్టోబర్ 27, 28 తేదీల్లో హర్యానాలోని సూరజ్ కుండ్ లో జరిగే రెండు రోజుల 'చింతన్ శివార్'లో సైబర్ క్రైమ్ నిర్వహణ, నేర న్యాయ వ్యవస్థలో ఐటీ వినియోగం పెరగడం, మహిళల భద్రత, తీరప్రాంత భద్రత, ఇతర అంతర్గత భద్రతా అంశాలపై చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన ‘విజన్ 2047’, ‘పంచప్రాన్’ అమలుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘చింతన్ శివిర్’కు అధ్యక్షత వహిస్తారని అధికారిక ప్రకటన తెలిపింది. మోడీ అక్టోబర్ 28న 'చింతన్ శివిర్'లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు.
సైబర్ క్రైమ్ మేనేజ్మెంట్ కోసం పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి, పోలీసు బలగాల ఆధునీకరణ, నేర న్యాయ వ్యవస్థలో సమాచార సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుదల, భూ సరిహద్దు నిర్వహణ, తీర ప్రాంత భద్రత, ఇతర అంతర్గత భద్రతా సమస్యలపై ఈ కార్యక్రమంలో చర్చిస్తారని అధికారిక ప్రకటన తెలిపింది. '2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం' లక్ష్యాన్ని చేరుకోవడంలో 'నారీ శక్తి' పాత్ర ముఖ్యమైనదనీ, మహిళల భద్రత, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఇదివరకు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయా లక్ష్యాలను సాధించడం కోసం ప్రస్తుత చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పేర్కొన్న రంగాలలో జాతీయ విధాన రూపకల్పన, మెరుగైన ప్రణాళికలు, సమన్వయాన్ని సులభతరం చేయడం కూడా సమావేశం లక్ష్యంగా ఉంది.
'చింతన్ శివిర్'లో ఆరు సెషన్లలో వివిధ అంశాలపై చర్చిస్తారు. మొదటి రోజు హోంగార్డులు, సివిల్ డిఫెన్స్, ఫైర్ ప్రొటెక్షన్, శత్రు ఆస్తులు తదితర అంశాలపై చర్చిస్తారు. మరుసటి రోజు సైబర్ సెక్యూరిటీ, డ్రగ్స్ ట్రాఫికింగ్, మహిళల భద్రత, సరిహద్దు నిర్వహణ వంటి అంశాలపై చర్చిస్తామని సంబంధిత ప్రకటన పేర్కొంది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్-1985, కమిటీ ఆఫ్ నార్కో కో ఆర్డినేషన్ సెంటర్, నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆన్ అరెస్టైన నార్కో-నేరస్తులు-నషా ముక్త్ భారత్ అభియాన్ లతో సహా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమస్యలపై 'చింతన్ సివిర్' లోప్రత్యేకంగా చర్చించనున్నారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి భూ సరిహద్దు నిర్వహణ, తీర భద్రత అనే అంశాల మీద కూడా చర్చించనున్నారు. ఇంటర్-ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ICJS), క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ & సిస్టమ్స్ (CCTNS), ఐటీ మాడ్యూల్స్- NAFIS, ITSSO, NDSO, Cri-MACలను ఉపయోగించి సాంకేతికత ఆధారిత దర్యాప్తు ద్వారా నేరారోపణ రేటును పెంచడం కూడా చర్చించబడుతుంది.
సేఫ్ సిటీ ప్రాజెక్ట్, 112-సింగిల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్, జిల్లాల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు, పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్లు, మత్స్యకారులకు బయోమెట్రిక్ గుర్తింపు కార్డులు వంటి కార్యక్రమాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, నిర్ధారించడం ఈ సమావేశాల ఉద్దేశమని సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్ని రాష్ట్రాల హోంమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల నిర్వాహకులను 'చింతన్ శివిర్'కు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం కార్యదర్శులు, పోలీసు డైరెక్టర్ జనరల్లు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, కేంద్ర పోలీసు సంస్థల డైరెక్టర్ జనరల్లు కూడా పాల్గొంటారు.