Asianet News TeluguAsianet News Telugu

భారత్ జోడో యాత్ర‌పై ఈసీకి ఫిర్యాదు.. మ‌రీ కాంగ్రెస్ వివరణేంటీ?

రాహుల్ గాంధీ చేప‌ట్టిన‌ భారత్ జోడో యాత్రలో చిన్నారులను ప్ర‌చారంలో ఉప‌యోగించుకుంటున్నార‌ని ఎన్‌సీపీసీఆర్ క‌మిషన్ ఛైర్మన్ ప్రియాంక్ కనుంగో పేర్కొన్నారు.  కాంగ్రెస్ పిల్ల‌ల హ‌క్కుల‌ను ఉల్లంఘిస్తోందనీ, దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అధికార బీజేపీ, దాని అనుబంధ సంస్థ‌లు అబ‌ద్దపు ప్ర‌చారం చేస్తున్న‌ద‌ని ఈసీకి వివ‌ర‌ణ ఇచ్చింది.  

Children were not used for campaigning during Bharat Jodo Yatra, Congress tells EC
Author
First Published Oct 11, 2022, 1:24 PM IST

కాంగ్రెస్ 'భారత్ జోడో యాత్ర'లో చిన్నారులు సంఘటితంగా పాల్గొంటున్నారని ఎన్నికల కమిషన్‌కు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్)  ఫిర్యాదు చేసింది. కమిషన్ ఛైర్మన్ ప్రియాంక్ కనుంగో ఈ పర్యటనపై 'కాంగ్రెస్‌కు చెందిన జవహర్ బాల్ మంచ్ 'చిల్డ్రన్ జోడో' ప్రచారాన్ని నడుపుతోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చిన్నారుల పిల్ల‌ల హ‌క్కుల‌ను కాంగ్రెస్  ఉల్లంఘిస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశామ‌ని తెలిపారు. కాంగ్రెస్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని, ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగించుకుంటోందని కనుంగో అన్నారు.

కాంగ్రెస్ వివ‌ర‌ణ 

భారత్ జోడో యాత్రలో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించలేదని, పిల్లలను ప్రచారానికి ఉపయోగించలేదని  ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ వివ‌ర‌ణ ఇచ్చింది. బాలల హక్కుల సంఘం (ఎన్‌సిపిసిఆర్) ఫిర్యాదు పనికిరానిదని నిందించింది. నిరాధారమైనదని విమ‌ర్శించింది. అధికార పార్టీ, దాని కార్యకర్తలు పిల్లలను దుర్మార్గంగా, వక్రమార్గంలో ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కూడా బిజెపిపై కౌంటర్ ఫిర్యాదు చేసింది.

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్) ఫిర్యాదుపై పోల్ వాచ్‌డాగ్ ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వడానికి ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, పార్టీ సోషల్ మీడియా హెడ్ సుప్రియా శ్రీనాట్, సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్‌లతో కూడిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్ అధికారులను కలిసింది. .

అనంత‌రం ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మీడియా మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రలో ప్రజాప్రాతినిధ్య చట్టం లేదా మోడల్ కోడ్ ఉల్లంఘన జరగలేదని ఈసీకి తెలియజేసామని తెలిపారు. ఎన్‌సిపిసిఆర్ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం  త‌మ‌కు ఎందుకు నోటీసు ఇచ్చిందో.. అర్థం చేసుకోవడంలో విఫలమయ్యామని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి పిల్లలను ఉపయోగించుకున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని రమేష్ అన్నారు. ప్ర‌జలు వేలాదిగా రోడ్లపైకి వచ్చి రాహుల్ గాంధీతో సెల్ఫీలు దిగాలని కోరుకుంటున్నారని, ఇది చట్టవిరుద్ధమైన చర్య కాదని, ఎన్నికల ప్రచారం చేయడం లేదని, రాహుల్ గాంధీ పిల్లలకు ఓటు వేయమని అడగడం లేదని ఆయన అన్నారు.

2007లో ఎన్‌సిపిసిఆర్‌ని ప్రారంభించిన తర్వాత.. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త దీనికి నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి అని రమేష్ అన్నారు. ఎన్‌సిపిసిఆర్ ఆరోప‌ణ‌లు పూర్తిగా నిరాధారమని ఈసీకి చెప్పామ‌ని.. ఎలాంటి చట్టాన్ని ఉల్లంఘించలేదని  తెలిపారు. జోడో యాత్ర‌ను దెబ్బ తీయ‌డానికి బీజేపీ అనుచ‌రులు వంతపాడుతుందనడానికి ఇదంతా మరో ఉదాహరణ అని ఆయన అన్నారు. 

సెప్టెంబరు 7న ప్రారంభ‌మైన భారత్ జోడో యాత్రలో పిల్లలను రాజకీయ సాధనాలుగా దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్, రాహుల్ గాంధీపై వచ్చిన ఫిర్యాదుపై అవసరమైన చర్యలు,  విచారణను ప్రారంభించాలని ఎన్‌సిపిసిఆర్  ఎన్నిక‌ల క‌మిష‌న్ ను కోరింది .

రాహుల్ గాంధీ, జవహర్ బాల్ మంచ్ రాజకీయ ఉద్దేశాలతో పిల్లలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కార్యకలాపాల్లో పాలుపంచుకునేలా చేస్తున్నారనే ఫిర్యాదును స్వీకరించినట్లు ఎన్‌సిపిసిఆర్ తెలిపింది.

ఫిర్యాదుదారు ప్రకారం.. భార‌త్ జోడో యాత్ర‌లో అనేక అవాంతర చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయని, ఇందులో పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారని,  'భారత్ జోడో' నినాదంతో రాజకీయ ఎజెండాతో వారి ప్రచారంలో పాల్గొనేలా చూడవచ్చని ఆరోపించబడింది. బచ్చే జోడో అని ఎన్‌సిపిసిఆర్  పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios