CPM state meet:గవర్నర్‌ను, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని కేరళలోని లెఫ్ట్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోదీ సర్కారు కుట్రలు పన్నుతున్నదని సీపీఎం ఆరోపించింది. 

CPM state meet: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కేరళ అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఐ-ఎం), ముఖ్యమంత్రి పినరయి విజయన్ విరుచ‌క‌ప‌డ్డారు. కేంద్ర‌ప్ర‌భుత్వం.. గవర్నర్‌ను, కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుని వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నార‌ని, కేర‌ళ ప్ర‌భుత్వాన్ని కేంద్రం లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ధనువాచపురంలో శుక్ర‌వారం జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయన్ ప్రసంగిస్తూ.. 'కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డ్' (కిఐఐఎఫ్‌బి) నిధులతో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రభావితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు అంగీకరించరని అన్నారు. 

అదే సమయంలో, రాష్ట్ర కమిటీ సమావేశం తర్వాత సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకోవడం ప్రారంభించిందని ఆయన ఆరోపించారు. అటువంటి ప్రయత్నాన్ని ప్రజల మద్దతుతో తీవ్రంగా వ్యతిరేకిస్తామని బాలకృష్ణన్ చెప్పారు.

 KIIFB అనేది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. భారీ, ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాథమిక ఏజెన్సీ. కేఐఐఎఫ్‌బీ ఆర్థిక కార్యకలాపాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈడీ ఇటీవల రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి టీఎం థామస్‌కు నోటీసులు జారీ చేశారు. 

ఈ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “మౌలిక సదుపాయాలు, విద్య మరియు ఆరోగ్య సేవలతో సహా వివిధ రంగాలలో అభివృద్ధికి KIIFB మాకు సహాయం చేస్తుంది. అయితే, మా అభివృద్ధి ప్రణాళికలను లక్ష్యంగా చేసుకునే వ్యక్తులు కొందరు ఉన్నారు. మా అభివృద్ధి ప్రణాళికలు విఫలమైతే, వారు సంతోషంగా ఉన్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధి అవకాశాలకు ఆటంకం కలిగిస్తుందని అన్నారు.