Asianet News TeluguAsianet News Telugu

దారుణం: 44 మంది చిన్నారులపై లైంగిక దాడి, ఐదుగురి అరెస్ట్

తమిళనాడు రాష్ట్రంలోని అనాధ బాలికల ఆశ్రమంలో నిర్వాహకులు లైంగికదాడికి పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. ఈ ఆశ్రమాన్ని సోమవారంనాడు  జడ్జి తనిఖీ చేయడంతో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి.

 

 

Chennai Police rescues 44 children from orphanage following child abuse complaints
Author
Chennai, First Published Aug 27, 2018, 6:28 PM IST


చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని అనాధ బాలికల ఆశ్రమంలో నిర్వాహకులు లైంగికదాడికి పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. ఈ ఆశ్రమాన్ని సోమవారంనాడు తనిఖీ చేసిన జడ్జికి దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి.  దీంతో  44 మంది బాలికలను  సురక్షిత ప్రాంతానికి తరలించారు.

తమిళనాడు  రాష్ట్రంలోని చెన్నైలోని సరస్వతి నగర్‌లో ఈ ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో 5 నుండి 14 ఏళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. సోమవారం నాడు ఈ ఆశ్రమాన్ని జడ్జిలు  తనిఖీ చేశారు.

జడ్జి తనిఖీతో  బాలికపై  లైంగిక దాడుల విషయం వెలుగు చూసింది. తమపై లైంగిక దాడికి సంబంధించి బాలికలు దారుణమైన విషయాలను బాలికలు బయటపెట్టారు. దీంతో  పోలీసులు ఈ ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించారు.ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులతో పాటు   ఐదుగురిని అరెస్ట్ చేశారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios