Asianet News TeluguAsianet News Telugu

బాబుతో కలిసి రాహుల్ బ్రేక్ ఫాస్ట్: అదే హోటల్లో మాయావతి

గురువారం ఉదయం చంద్రబాబు రాహుల్ గాంధీని అల్పాహార విందుకు ఆహ్వానించారు. పార్క్ హయత్ హోటల్లో వారిద్దరు కలిసి అల్పాహార విందు ఆరగించారు. 

Chandrababu invites Rahul Gandhi for breakfast
Author
Hyderabad, First Published Nov 29, 2018, 10:27 AM IST

హైదరాబాద్: జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకించేందుకు అంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వదులుకోవడం లేదు. బుధవారం రాహుల్ గాంధీతో కలిసి తెలంగాణలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

హైదరాబాదులో కూడా ఇరువురు వేదికను పంచుకున్నారు. ఈ స్థితిలో గురువారం ఉదయం చంద్రబాబు రాహుల్ గాంధీని అల్పాహార విందుకు ఆహ్వానించారు. పార్క్ హయత్ హోటల్లో వారిద్దరు కలిసి అల్పాహార విందు ఆరగించారు. 

హైదరాబాదులో పార్టీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన బిఎస్పీ అధినేత మాయావతి అదే హోటల్లో బస చేశారు. ఈ విందుకు ఆమె హాజరయ్యారా, లేదా అనేది తెలియడం లేదు. జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా చక్రం తిప్పేందుకు నడుం బిగించిన చంద్రబాబు ఆమెను కూడా బ్రేక్ ఫాస్ట్ కు ఆహ్వానించినట్లు చెబుతున్నారు 

Follow Us:
Download App:
  • android
  • ios