హర్యానాలోని ముస్లిం-ఆధిపత్య జిల్లా మేవాత్ చందాయిని గ్రామం మహిళా సాధికారతకు ఆదర్శంగా నిలిచింది. బ్రిటీష్ పాలనలో కూడా ఇక్కడి ప్రజలు బాలికలను పాఠశాలలకు, కళాశాలలకు పంపేవారు. అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా చదువుకోవడానికి ప్రోత్సహించారు. అందుకే చందాయిని 'మేవాత్ మోడల్ విలేజ్' అని పిలుస్తారు.

హర్యానాలోని ముస్లిం-ఆధిపత్య జిల్లా మేవాత్ లో దాదాపు 6,000 మంది ప్రజలు నివసించే గ్రామం చందాయిని. ఇది రాజధాని న్యూఢిల్లీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే.. మేవాత్ మూస చిత్రణకు విరుద్ధంగా.. ఆధునిక భావజాలంతో అభివ్రుద్ది పథంలో సాగుతోంది ఈ గ్రామం. చదువు ప్రాధాన్యత తెలుసుకున్న ఈ గ్రామం సమాజంలోని మూస ధోరణికి చరమగీతం పాడుతోంది. బ్రిటిష్ కాలంలోనే ఇక్కడి ప్రజలు బాలికలను పాఠశాలలకు, కళాశాలలకు పంపేవారు. అందుకే మహిళా సాధికారత గ్రామంగా చరిత్రలో నిలిచింది. అక్కడి ప్రజల సామాజిక స్థితిగతులకు తెలుసుకోవడానికి ఆవాజ్-ది వాయిస్ బృందం చందాయినికి వెళ్లింది. ఆవాజ్-ది వాయిస్ బృందానికి ఆ గ్రామ పెద్దలు సాధరంగా ఆహ్వానం తెలిపారు. 

మేవాత్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ అలీ మాట్లాడుతూ.. ఈ గ్రామం 2700 మంది ఓటర్లు. హవేలీ కొంతవరకు శిథిలావస్థలో ఉంది. మేవాత్‌లోని సంతోషకరమైన గ్రామాలలో చందాయిని లెక్కించబడుతుందని తెలిపారు. హవేలీ లో నివసించే ఆసిఫ్ అలీ వ్యక్తి ఆ గ్రామం గురించి వివరించారు. ఆ గ్రామ కథలు చెప్పాడు. మేవాత్ వెలుపలి వ్యక్తులకు తెలియని చాలా వాస్తవాలు తెలుసుకుని నేను ఆశ్చర్యపోయాను. గ్రామంలోని బాలికల విద్యా ప్రమాణాలు, సాధికారత గురించిన వాస్తవాలు, గణాంకాలు చాలా ఆశ్చర్యకరమైనవి. ఆసిఫ్ అలీ మాటలు విన్న తర్వాత.. చందాయిని 'మేవాత్ మోడల్ విలేజ్' అని పిలవడం అతిశయోక్తి కాదని నేను గ్రహించాను.

నుహ్ జిల్లాలో 431 గ్రామాలు ఉన్నాయి. సమగ్ర విద్యాశాఖ జిల్లా సమన్వయకర్త సమాచారం ప్రకారం.. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, సీనియర్‌ సెకండరీ, ఉన్నత, ఆరోహి, కస్తూర్బా, మేవాత్‌ మోడల్‌ పాఠశాలలు 941 ఉండగా.. అందులో 3,691 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. నుహ్ జిల్లా అక్షరాస్యత రేటు 43.5 శాతం. 2021-22లో 2,641 మంది బాలికలు (6 నుంచి 10 ఏళ్లు), అలాగే..1509 మంది (11-14 ఏళ్ల మధ్య వయస్సు గలవారు) చదువు మానేసినట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2022-23 విద్య సంవత్సరంలో వరుసగా 839, 389 మంది చదువు మానేశారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన దేశంలోని అత్యంత వెనుకబడిన 100 జిల్లాల జాబితాలో నుహ్ అగ్రస్థానంలో ఉన్నాడు.

అటువంటి ప్రతికూల పరిస్థితులలోనూ.. చందాయిని మహిళా విద్య ప్లాగ్ బేరర్‌గా కొనసాగుతుంది. ముస్లిం-ఆధిపత్య చందాయినిలో నివసిస్తున్న 5 శాతం కుల (ముస్లిమేతర) ప్రజలు కూడా ప్రగతిశీల సమాజంలో భాగమేనని నేను గ్రహించాను. ఇక్కడ ప్రజలు విద్యను సామాజిక , ఆర్థిక మార్పుల ఆయుధంగా ఉపయోగించారు. గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ప్రహ్లాద్ సింగ్ మనవరాలు అయిన చేతన, గుర్గావ్‌లోని AGT విశ్వవిద్యాలయం లో ఆయుర్వేదంలో MS (డాక్టర్) చదువుతోంది. అలాగే.. అక్తర్ కుమార్తెలలో ఒకరు టెలివిజన్ ఛానెల్‌లలో న్యూస్ యాంకర్‌గా పనిచేశారు. 

ఈ ఇలాంటి పరిస్థితిలోనూ ఆమె గురుగ్రామ్‌లోని బాలికల కళాశాల నుండి ఆంగ్ల భాషలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. అలాగే అక్తర్ రెండో కూతురు కూడా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. మేవాత్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ అలీ కూడా MA B.Ed. వీరిలో అతని కుమారుల్లో ఒకరు ఎంబీఏ పూర్తి చేయగా, మరొకరు అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. అలాగే.. హర్యానా వక్ఫ్ బోర్డు స్టేట్ ఆఫీసర్ ఖుర్షీద్ అహ్మద్ కుమార్తె దిశాద్ దుబాయ్‌లోని ఎంఎన్‌సిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ఆసిఫ్ అన్నయ్య లియాకర్ అలీ హర్యానా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. అతని కుమార్తె షామియా అర్జూ దుబాయ్‌లోని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఏరోనాటిక్స్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

షమియా ఫరీదాబాద్‌లోని మానవ్ రచనా యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. గ్రామానికి చెందిన ఆర్తి సోనిపట్‌లో న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తోంది. అస్గర్ పట్వారీకి ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె MBBS కోర్సు చేస్తున్నారు. ఫకృద్దీన్ తమ్ముడు మెహబూబ్ ఐగుర్గావ్‌లో ఆర్కిటెక్ట్ , అతని సోదరి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి LSW చేసారు. జాకీర్ కూతురు గుర్గుగ్రామ్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఉన్నత విద్యావంతుల జాబితాలో చాలా మంది బాలికలు ఉన్నారు.

గ్రామంలోని యువ తరం కొత్త కెరీర్‌లు,ఆర్థిక అవకాశాలను స్వీకరిస్తోంది. వారిలో కొందరు 'బ్లాక్ చేంజ్', క్రిప్టోకరెన్సీలో కెరీర్‌ని కూడా చేస్తున్నారు. 21 ఏళ్ల అఫ్తాబ్ GD గోయెంకా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేస్తున్నాడు. అయినప్పటికీ, అతను క్రిప్టోకరెన్సీలో వృత్తిని కొనసాగించడానికి ఆసక్తిగా ఉన్నాడు. ఆమె చెల్లెలు అలీషా ఫ్యాషన్ డిజైన్‌లో కెరీర్‌ను కొనసాగించాలని యోచిస్తోంది. గ్రామానికి చెందిన దాదాపు 15 మంది యువకులు కొత్త రంగాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జిడి గోయెంకా వంటి ప్రధాన ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారని గ్రామస్థులు చెప్పారు. వారిలో అమ్మాయిలు కూడా ఉన్నారు. GD గోయెంకా యూనివర్శిటీకి చెందిన బస్సు ప్రతిరోజూ గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకోవడానికి , దింపడానికి వస్తుంది. చందాయిని పూర్తిగా అక్షరాస్యత కలిగిన గ్రామమని అక్తర్ చెప్పాడు.

అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా అందరికీ చదువు పట్ల ఆసక్తి ఉంటుంది.అదే సమయంలో ఇంజినీరింగ్ విద్యార్థి అఫ్తాబ్ మాట్లాడుతూ గ్రామంలోని 20 శాతం మంది యువకులు నుహ్ సిటీలో మోటార్ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారని తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. చందైనీకి చెందిన చాలా మంది బాలబాలికలు ప్రస్తుతం పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, న్యాయవాదులుగా, పోలీసులుగా చిన్న, పెద్ద పదవుల్లో ఉన్నారు.

మాస్టర్ ప్రహ్లాద్, ఖరీ రంజాన్ అనే రెండు పేర్లు చందాయినిలోని ప్రతి గ్రామస్తుల పెదవులపై ఉంటాయి. 2004లో హెడ్ మాస్టర్‌గా పదవీ విరమణ చేసిన ప్రహ్లాద్ సింగ్ ఆజాద్ గ్రామంలో మెట్రిక్యులేషన్‌లో మొదటి స్థానంలో నిలిచారు. అతను 1963లో మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణుడై, 1965లో ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు. సుమారు 60 సంవత్సరాల క్రితం మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మౌల్వీ సుభాన్ ఖాన్ కుమార్తెను మెట్రిక్యులేషన్ పాసైన మొదటి మహిళగా భావిస్తారు. మాస్టర్ ప్రహ్లాద్ , దివంగత ఖారి రంజాన్ కృషి వల్లే గ్రామంలో అక్షరాస్యత పెరిగిందని, వారు విద్యాపై అవగాహన కల్పించడానికి ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపట్టారని గ్రామస్తులు అంటున్నారు.

మాస్టర్ ప్రహ్లాద్ అవాజ్-ది వాయిస్‌తో మాట్లాడుతూ.. లియాఖత్ అలీ (రిటైర్డ్ BDO)తో సహా చాలా మంది వ్యక్తులు మంచి విద్యను పొందారు. తమకు, వారి పిల్లలకు మంచి జీవితాన్ని అందించారు.తన దగ్గర విద్యనభ్యసించిన పిల్లలు నేడు సమాజంలో ప్రముఖులుగా ఉన్నారని ప్రహ్లాద్ గర్వంగా చెప్పారు. మేవాత్‌లోని 'క్లోజ్డ్ సొసైటీ'ని కూల్చివేసి, విద్య ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతోందనీ భావించారు. కొన్ని సందర్భాల్లో స్థానికులు కూడా బాలికల విద్యకు వ్యతిరేకంగా ఉన్న శక్తులు, మనస్తత్వంపై పోరాడుతున్నారని తెలిపారు. ఈ గ్రామంలోని చాలా కుటుంబాలు తమ పిల్లలను కాలేజీకి పంపేందుకు మేవాత్‌కు మారాయి.

మేవాత్‌లోని ఈ గ్రామంలో భద్రత, పర్దా, ఇస్లాం మొదలైన సాకులతో మహిళలు విద్యను అభ్యసించకుండా ఆపివేస్తారు. కారి రంజాన్ బాలికల కోసం సెమినరీని ప్రారంభించినప్పుడు అనేక నిరసనలు వెల్లువెత్తాయనీ, ఆ నిరసనల వల్ల తాము ఇబ్బంది పడ్డామని అక్తర్, ఆసిఫ్ చెప్పారు. తరువాత కొన్ని మార్పులు వచ్చాయి. ఆ పాఠశాల 313 మంది బాలికలు చదువుకున్నారు. అక్తర్ కోడలు ఫాతిమా అదే మదర్సాలో అలీమ్‌ను చదివింది. ఈ మదర్సాలో బాలికలకు మతపరమైన విద్యతోపాటు ఆధునిక విద్యను అందిస్తున్నారు. బాలికల కోసం మదర్సాను స్థాపించడానికి అనేక ఇస్లామిక్ దేశాల నుండి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. బాలికల మదర్సాలో ఇస్లాం పుస్తకాలతో కూడిన లైబ్రరీ ఉంది. ఇది చందానీలో నివసిస్తున్న గ్రామస్తులు ఇస్లాంను సరిగ్గా అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఖారీ 10 సంవత్సరాల క్రితం మరణించాడు.అతని పిల్లలు ఆ పాఠశాలను కొనసాగిస్తున్నారు.

గ్రామీణా ఆర్థిక వ్యవస్థ 

మేవాత్ చుట్టూ ఉన్న దుర్భరమైన, తిరోగమన వాతావరణ పరిస్థితులున్న చందాని ఆదర్శ గ్రామంగా నిలిచింది. ఆరావళి కొండ దిగువన ఉన్న ఈ గ్రామం బ్రిటిష్ పాలనలో ఒకప్పుడు తీవ్ర వరదలను ఎదుర్కొందని అక్తర్ ఖాన్ పేర్కొన్నారు. భారీ వరదలతో గ్రామంలోని పంటలన్నీ ధ్వంసమయ్యాయి. ఇలాంటి కఠిన పరిస్థితులను తట్టుకొని నిలబడాలంటే.. వ్యవసాయంతో పాటు విద్యను అభ్యసించే పంథా కొనసాగింది. వ్యవసాయంలో కూడా చందాయిని రైతులు గోధుమలు, పుచ్చకాయలను పండించడంలో ప్రసిద్ధి చెందారు. 

ఇదే సమయంలో గ్రామానికి చెందిన సర్దార్ ఖాన్ గురించి మాట్లాడారు. అతను లియాఖత్ అలీ వంటి వ్యక్తులను ప్రభావితం చేశారని, అతను బ్రిటిష్ వారిచే బహదూర్ బిరుదును కూడా పొందారని గ్రామస్తులు తెలిపారు. దేశ విభజన తర్వాత తన కుమారుడు సర్దార్ అహ్మద్ తుఫైల్ పాకిస్థాన్‌లో మంత్రి అయ్యాడని ఆసిఫ్ చెప్పారు. చౌదరి యాసిన్ , అతని కుమారుడు చౌదరి తయ్యబ్ పొరుగు గ్రామమైన రెహ్నాకు చెందినవారు. అయితే.. వారు చందాయినిలో ప్రభావవంతమైన వ్యక్తులు. చౌదరి తయ్యబ్ లోక్‌సభ, అసెంబ్లీకి అనేకసార్లు ఎన్నికయ్యారు. అతను హర్యానా, రాజస్థాన్,యునైటెడ్ పంజాబ్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. ఆయన కుమారుడు జాకీర్ హుస్సేన్ కూడా పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జకీర్ సోదరి జాహిదా రాజస్థాన్‌లోని కామా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. జాకీర్ అక్క అంజుమ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్.

చౌదరి యాసిన్ కుటుంబం నుహ్‌లో మేవాత్ లో మొదటి బ్రెయిలీ మియో స్కూల్‌ను స్థాపించింది. అది తర్వాత యాసిన్ ఖాన్ కళాశాలగా మారింది. ఈ మార్చి 28న ఇది స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 100 ఏళ్లు దాటినా ఈ కళాశాలను ఎందుకు అప్‌గ్రేడ్ చేయలేదని మేవాత్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా తరహాలో దీన్ని విస్తరించాలని మేవాత్ ప్రజలు కోరుకుంటున్నారు.

రచయిత: మాలిక్ అస్గర్ హష్మీ (హర్యానా)