కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా అంతర్రాష్ట్ర రవాణా నిలిచినపోయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేస్తున్నప్పటికీ అంతర్రాష్ట్ర రవాణాపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. 

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా అంతర్రాష్ట్ర రవాణా నిలిచినపోయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేస్తున్నప్పటికీ అంతర్రాష్ట్ర రవాణాపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆదివారం అంతర్రాష్ట్ర రవాణాపై అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఎత్తివేయాలని ఆదేశించారు.

వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదన్న అజయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంక్షల కారణంగా ఆర్ధిక కార్యకలాపాలు, ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఆంక్షలు విధిస్తే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని అజయ్ వ్యాఖ్యానించారు,