పేల్చేస్తాం..అంబానీ ఫ్యామిలీకి బాంబు బెదిరింపు
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి చెందిన హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి హాస్పిటల్ ల్యాండ్లైన్ నెంబర్కు ఫోన్ చేసి హాస్పిటల్ లో బాంబు పెట్టినట్లు బెదిరించారు.
పారిశ్రామిక దిగ్గజం, బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో బాంబు బెదిరింపుల కలకలం రేగింది. బుధవారం మధ్యాహ్నం 12.57 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి హాస్పిటల్ ల్యాండ్లైన్ నెంబర్కు ఫోన్ చేసి.. హాస్పిటల్కు బాంబు పెట్టినట్లు బెదిరించాడు. ముకేశ్ అంబానీ కుటుంబసభ్యుల్లో కొందరి పేర్లను ప్రస్తావించి వారిని కూడా చంపేస్తామని బెదిరించారు.
ముంబై పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ విషయం సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి సంబంధించినది. హఠాత్తుగా హాస్పిటల్ ల్యాండ్లైన్లో ఫోన్ మోగింది. ఆసుపత్రిని బాంబుతో పేల్చివేస్తానని కూడా ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించాడు. గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. అంబానీ కుటుంబానికి చెందిన కొందరి పేర్లను చెప్పి ఫోన్ చేసిన వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. ముకేశ్ అంబానీ, నీతా అంబానీలను చంపేస్తానని కూడా ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించినట్లు సమాచారం. ఈ ఘటనపై డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంతకు ముందు కూడా.. ఓ వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన ఈ ఆసుపత్రి ల్యాండ్లైన్కు కాల్ చేసి.. అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రతినిధి మాట్లాడుతూ.. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ను పేల్చివేస్తామని, అలాగే ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, ఇద్దరు కుమారులు ఆకాష్, అనంత్లను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామనీ, పోలీసులకు అవసరమైన అన్ని వివరాలను అందిస్తున్నామని తెలిపారు. గుర్తుతెలియని కాల్ చేసిన వ్యక్తిపై డిబి మార్గ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఈ విషయంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
విశేషమేమిటంటే, ఈ ఏడాది ఆగస్టులో పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరింపులకు పాల్పడిన నగల వ్యాపారి అరెస్టు చేశారు. ఫిబ్రవరి 2021లో అంబానీ దక్షిణ ముంబై నివాసం 'యాంటిలియా' సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (SUV) కనుగొనబడింది. ఈ ఘటనకు సంబంధించి అప్పటి పోలీసు అధికారి సచిన్ వాజేతో సహా కొంతమందిని అరెస్టు చేశారు.
హోటల్ లీలాకు బాంబు బెదిరింపులు
ఆగస్టు నెలలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ప్రముఖ లలిత్ హోటల్కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ కేసులో 5 కోట్లు డిమాండ్ చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంలో, కాల్ ద్వారా హోటల్ పరిపాలన నుండి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. తర్వాత 3 కోట్లు డిమాండ్ చేశారు. ఇది పేలకుండా ఉండాలంటే హోటల్ నిర్వాహకులకు 5 కోట్లు చెల్లించాలని ఓ వ్యక్తి ఫోన్లో బెదిరించాడు.
గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు పలుమార్లు ముఖేష్ అంబానీకి వచ్చాయి. దీంతో ఆయన భద్రత విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు భద్రతను పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఆయనకు జడ్ కేటగిరీ భద్రత నుంచి జడ్ ప్లస్ కేటగిరికి పెంచారు. ముఖేష్ అంబానికి ముప్పు పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్, భద్రతా సంస్థలు ఇచ్చిన నివేదికలను సమీక్షించి..ఆయనకు 'Z+ భద్రతను కల్పించాలని కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.