By-elections result: ఉప ఎన్నికలో ఆప్కు ఎదురుదెబ్బ.. సీఎం భగవంత్ మాన్ కంచుకోట కూలింది !
Sangrur Bypolls result: ఇద్దరు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు తర్వాత సంగ్రూర్ లోక్సభ స్థానం నుంచి సిమ్రంజిత్ సింగ్ మాన్ తన ఆప్ ప్రత్యర్థి గుర్మైల్ సింగ్పై 7,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Punjab By-elections result: పంజాబ్ ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కంచుకోటగా భావిస్తున్న సంగ్రూర్ లోక్ సభ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆప్ ఓడిపోయింది. ఇద్దరు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు తర్వాత సంగ్రూర్ లోక్సభ స్థానం నుంచి సిమ్రంజిత్ సింగ్ మాన్ తన ఆప్ ప్రత్యర్థి గుర్మైల్ సింగ్పై 7,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆప్. ఆ తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నికలో ఆప్ కంచుకోట, భగవంత్ మాన్ స్థానాన్ని నలిబెట్టుకోలేకపోయింది.
వివరాల్లోకెళ్తే.. ఈ వారం ప్రారంభంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని మూడు లోక్ సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆదివారం నాడు ఆయా స్థానాల ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడ్డాయి. పంజాబ్ ఉపఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. శిరోమణి అకాలీదళ్ (అమృత్సర్) అభ్యర్థి సిమ్రంజిత్ సింగ్ మాన్, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చివరిగా జరిగిన లోక్సభ స్థానంలో అధికార పార్టీ అభ్యర్థిని ఓడించారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు తర్వాత సంగ్రూర్ లోక్సభ స్థానం నుంచి సిమ్రంజిత్ సింగ్ మాన్ తన ఆప్ ప్రత్యర్థి గుర్మైల్ సింగ్పై 7000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీ, బీజేపీకి చెందిన కేవల్ ధిల్లాన్, అకాలీదళ్కు చెందిన కమల్దీప్ కౌర్ రాజోనా వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
జూన్ 23న పోలింగ్ జరిగింది. 16 మంది అభ్యర్థులు పోటీకి హాజరయ్యారు. సంగ్రూర్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 2019 లోక్సభ ఎన్నికల్లో 72.44 శాతం, 2014 ఎన్నికల్లో 76.71 శాతం పోలింగ్ జరగగా, ఈ సారి 45.30 శాతం తక్కువ ఓటింగ్ నమోదైంది. ఈసారి 15.69 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన భగవంత్ మాన్ లోక్సభ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న భగవంత్ మాన్ 2014 మరియు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సంగ్రూర్ స్థానం నుంచి గెలుపొందారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత జరిగిన మొదటి ప్రధాన ఎన్నికల పోరు ఈ ఉప ఎన్నిక ఇది. అధికార ఆప్కి, ఈ ఉపఎన్నిక తన కంచుకోటను నిలుపుకోవడం కోసం ప్రతిష్టాత్మక పోరుగా భావించగా, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఎస్ఎడి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైన తరువాత ఇక్కడ విజయాన్ని నమోదు చేయాలని చూశాయి.
పార్టీ సంగ్రూర్ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్న సింగ్ (38)ను ఆప్ రంగంలోకి దించగా, ధురి మాజీ ఎమ్మెల్యే దల్వీర్ సింగ్ గోల్డీని కాంగ్రెస్ ఎన్నికల పోరులో నిలిపింది. ఈ నెల ప్రారంభంలో పార్టీలో చేరిన బర్నాలా మాజీ ఎమ్మెల్యే ధిల్లాన్ను బీజేపీ రంగంలోకి దించింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో లెహ్రా, దిర్బా, బర్నాలా, సునమ్, బదౌర్, మెహల్ కలాన్, మలేర్కోట్ల, ధురి మరియు సంగ్రూర్ మొత్తం తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లను గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి సంగ్రూర్ పార్లమెంటరీ నియోజకవర్గం కంచుకోటగా మారింది. భగవంత్ మాన్ 2014 లోక్సభ ఎన్నికలలో SAD అభ్యర్థి సుఖ్దేవ్ సింగ్ ధిండాను 2.11 లక్షల ఓట్ల తేడాతో ఓడించి సంగ్రూర్ స్థానాన్ని గెలుచుకున్నారు. భగవంత్ మాన్ మళ్లీ 2019 లోక్సభ ఎన్నికల్లో సంగ్రూర్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కేవల్ ధిల్లాన్ను ఓడించి 1.10 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు.
శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు, ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, బీజేపీలు ఆప్పై దాడి చేయగా, అధికార పార్టీ మాత్రం అవినీతి నిర్మూలన హామీలపై దృష్టి సారించింది. ఉద్యోగాలను సృష్టించడం, పాఠశాలలు మరియు ఆసుపత్రుల పరిస్థితిని మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకుంటోంది.