40మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు
ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి... బస్సు పూర్తిగా దగ్ధమైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి... బస్సు పూర్తిగా దగ్ధమైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం తుమ్మకూరులో శనివారం ఉదయం బస్సు దగ్ధమైంది. ఆత్మకూరు నుంచి బస్సు బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా... అదృష్ట వశాత్తు ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.