Asianet News TeluguAsianet News Telugu

హిమాచల్ ప్రదేశ్‌లో లోయ‌లో ప‌డ్డ 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు

Dharamshala: హిమాచల్ ప్రదేశ్ లో 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. రాష్ట్రంలోని మండిలో 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న హిమాచల్ రోడ్డు రవాణా సంస్థ (హెచ్ ఆర్ టీసీ) బస్సు లోయలో పడిపోయిందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఈ ఘ‌ట‌న‌లో చాలా మంది గాయ‌ప‌డ్డారు.
 

Bus Carrying Over 40 Passengers Falls Into Gorge In Himachal Pradesh's Mandi RMA
Author
First Published Jun 1, 2023, 7:42 PM IST

Bus Falls Into Gorge In Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. మండి జిల్లాలోని కర్సోగ్ సబ్ డివిజన్ పరిధిలోని ఖరోడి సమీపంలో జరిగిన ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారని పోలీసు సూపరింటెండెంట్ సౌమ్య సంబశివం తెలిపారు. హిమాచల్ రోడ్డు రవాణా సంస్థ (హెచ్ఆర్టీసీ) బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బస్సు రోడ్డుపై నుంచి పడిపోయిన వెంటనే స్థానిక యంత్రాంగం అంబులెన్స్ ల‌ను సంఘటనా స్థలానికి తరలించి అత్యవసర సహాయక చర్యలు చేపట్టింది. వీరికి స్థానికులు కూడా సహకరించారు. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని ఆ ప్రాంతంలోని సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ నివేదించింది. బస్సు లోయలో పడి రెండు చెట్ల మధ్య చిక్కుకుందని, దీంతో వాహనం లోయలో పడకుండా నిరోధించిందని ప్రమాద స్థలంలో ఉన్నవారు తెలిపారు. 

కాగా, ఈ ఘటనలో గాయపడిన డ్రైవర్, కండక్టర్, ఇతర ప్రయాణికుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని స‌మాచారం. ప్రస్తుతానికి ప్రమాదానికి గల ప్రధాన కారణాలు తెలియరాలేదని, ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని అధికారులు తెలిపారు. కాగా, మే 31న చాందీ చౌకీ హరిద్వార్ సమీపంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్ రోడ్ వేస్ బస్సు రుపాహియా నుంచి హరిద్వార్ కు 41 మంది ప్రయాణికులతో వెళ్తోంది. అలాగే, మే 30న అమృత్ సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు లోతైన లోయలో పడిపోవడంతో 10 మంది మృతి చెందగా, 55 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. వీరిలో ప‌ల‌వురి ప‌రిస్థితి ఇంకా విష‌మంగా ఉంద‌ని స‌మాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios