Bulldozers: అమాయక ముస్లింల టార్గెట్గానే బుల్డోజర్లు.. దర్గా దగ్గర హనుమాన్ విగ్రహం.. ఓవైసీ ఫైర్
Madhya Pradesh: అమాయక ముస్లింలను టార్గెట్ చేసుకుని బుల్డోజర్లు వ్యవహారం నడుపుతున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. దర్గా దగ్గర హనుమాన్ విగ్రహం పెట్టడంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ఆయన ఫైర్ అయ్యారు.
AIMIM chief Asaduddin Owaisi: దేశంలో గత కొన్ని రోజులుగా బుల్డోజర్ల నేపథ్యంలో కొనసాగుతున్న వివాదాలు మరింతగా ముదురుతున్నాయి. రాజకీయంగా రగడ సృష్టిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బుల్డోజర్ల వ్యవహారం తెరపైకి తీసుకువచ్చిందని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ బుల్డోజర్ల ఘటనపై మరోసారి స్పందిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక ముస్లింలను టార్గెట్ చేసుకుని బుల్డోజర్లు వ్యవహారం నడుపుతున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దర్గా దగ్గర హనుమాన్ విగ్రహం పెట్టడంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ఆయన ఫైర్ అయ్యారు.
AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం మధ్యప్రదేశ్లో చెలరేగిన మత వివాదం నేపథ్యంలోని ఘర్షణల గురించి మాట్లాడారు. దర్గా సమీపంలో హిందూ దేవతల విగ్రహాలను ఉంచిన తర్వాత చెలరేగిన హింసను రాష్ట్ర ప్రభుత్వమే కావాలని సృష్టించిందని ఆరోపించారు. ఈ ఘటన క్రమంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోని బుల్డోజర్ల రాజకీయాలను ప్రస్తావిస్తూ నిన్న నీముచ్లో మసీదును అపవిత్రం చేశారన్న ఆరోపణలు వచ్చిన వారిని తమ రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేస్తుందా అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ఒవైసీ ప్రశ్నించారు.
ఇటీవల దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగిన బుల్డోజర్ డ్రైవ్లో బుల్డోజర్లను "అమాయక ముస్లింలకు" వ్యతిరేకంగా మాత్రమే ఉపయోగిస్తున్నారని AIMIM చీఫ్ అసదుద్ధీన్ ఒవైసీ అన్నారు. మధ్యప్రదేశ్ నగరంలోని మసీదు అపవిత్రతను చూపించే కొన్ని చిత్రాలను కూడా ఒవైసీ ట్విట్టర్లో పంచుకున్నారు. మే 17న రాష్ట్రంలో చెలరేగిన ఘర్షణలను ప్రస్తావిస్తూ ఒవైసీ ట్విట్టర్లో.. "సర్ @CMMadhyaPradesh మసీదు & దర్గాను అపవిత్రం చేసిన నిందితులను మీ ప్రభుత్వం అరెస్టు చేసిందా? అమాయక ముస్లింలపై మాత్రమే బుల్డోజర్లను ప్రయోగిస్తారని మాకు తెలుసు" అని ట్వీట్ చేశారు.
కాగా, మధ్యప్రదేశ్లోని నీముచ్లో మంగళవారం నాడు ఒక సమూహం హనుమంతుని విగ్రహాన్ని దర్గా మరియు మసీదు గోడపై ఉంచడంతో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. నీముచ్లో రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో వివాదం హింసాత్మకంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేయడందో ఘర్షణలుఏ అందుపులోకి వచ్చాయి. నిన్న మధ్యప్రదేశ్లో ఘర్షణలు చెలరేగిన తర్వాత, నీముచ్లో రాళ్లదాడి మరియు దహనం సంఘటనలు నమోదయ్యాయి. పోలీసులు అనేక కేసులు నమోదు చేసిన తర్వాత సోమవారం అర్థరాత్రి నీముచ్ నగరంలో CrPC సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించాలని అధికారులు నిర్ణయించారు.
ప్రస్తుతం అందుతున్న నివేదికల ప్రకారం.. ఘర్షణలకు పాల్పడిన రెండు గ్రూపులను ప్రశ్నించడానికి పోలీసు కంట్రోల్ రూమ్కు రావాలని కోరారు, అయితే ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం మరియు మోటార్సైకిళ్లను ధ్వంసం చేయడం ప్రారంభించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు పెద్ద ఎత్తున టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కూడా ఘర్షణలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మత ఘర్షణల సమయంలో రాష్ట్ర పోలీసుల నిష్క్రియాత్మకతపై ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఆయన ఆరోపించారు.