Asianet News TeluguAsianet News Telugu

ఈజిప్టులో పురాతన బుద్ధ విగ్రహం లభ్యం.. రోమన్ సామ్రాజ్యంతో ప్రాచీన భారతానికి మధ్య వాణిజ్య సంబంధాలు!

ఈజిప్టులో పురాతన బుద్ధ విగ్రహం ఒకటి లభ్యమైంది. ఈ విగ్రహం అనేక ప్రాచీన రహస్యాల గుట్టు విప్పుతున్నది. ఈ విగ్రహం రోమన్ సామ్రాజ్య కాలంనాటిదని తేలింది. దీంతో రోమన్ సామ్రాజ్య కాలంనాటి ఈజిప్టుకు, ప్రాచీన భారతానికి మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయనే సంకేతాలు వచ్చాయి.
 

buddha statue found in egypt, points trade ties between ancient india and roman era egypt kms
Author
First Published Apr 27, 2023, 11:10 PM IST

న్యూఢిల్లీ: ఈజిప్టులో పురాతన బుద్ధ విగ్రహం బయటపడింది. ఈ విగ్రహంతో మరెన్నో రహస్యాల గుట్టు వీడుతున్నది. ఈ విగ్రహం రోమన్ సామ్రాజ్య కాలం నాటిదని గుర్తించారు. దీంతో రోమన్ సామ్రాజ్య కాలంలో అక్కడి ప్రాంతానికి, భారత దేశానికి మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయనే వాదనలు బలంగా వస్తున్నాయి. 

ఎర్ర సముుద్రాన్ని అనుకుని బెరెనిస్ అనే ఈజిప్ట నగరం ఉన్నది. ఈ నగరంలో  చరిత్రలో ప్రసిద్ధ ఓడరేవు ఉండేది. ఈ ఓడరేవు నగరంలోనే బుద్ధుడి విగ్రహం లభించింది. ఈ విగ్రహం రోమన్ సామ్రాజ్య కాలం నాటిదని ఒక పోలాండ్, అమెరికా మిషన్ కొనుగొన్నట్టు ఈజిప్టు యాంటిక్విటీస్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

రోమన్ సామ్రాజ్య కాలంలో ప్రాచీన ఈజిప్టు, ప్రాచీన ఇండియాకు మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయనే ముఖ్యమైన సంకేతాలను ఈ బుద్ధుడి విగ్రహం ఇస్తున్నదని ఈజిప్టు సుప్రీం యాంటిక్విటీస్ కౌన్సిల్ మొస్తఫా అల్ వజీరి తెలిపారు.

ఆ విగ్రహం దానికి కుడి భాగాన్ని దాదాపు కోల్పోయి ఉన్నది. కుడి చేయి, కుడి కాలు లేదు. 71 సెంటిమీటర్లు (28 ఇంచులు) ఎత్తు ఈ విగ్రహం ఉన్నది.

రోమన్ సామ్రాజ్య కాలం నాటి ఈజిప్టులో బెరెనిస్ అనేది ప్రసిద్ధ ఓడరేవు పట్టణం. ఇండియా నుంచి వచ్చే సుగంధ ద్రవ్యాలు, సెమీ ప్రీషియస్ స్టోన్లు, టెక్స్‌టైల్, ఐవరీలు ఈ ఓడరేవుకే చేరేవని ఊహిస్తున్నారు. 

Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి

ఈజిప్టు అనేక పురాతన ఆవిష్కరణలు చేస్తున్నది. ముఖ్యంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షించాలనే లక్ష్యం దీని వెనుక ఉన్నట్టు తెలుస్తున్నది. రాజకీయ సంక్షోభం, కరోనా మహమ్మారితో పర్యాటక రంగం కుదేలైంది. మళ్లీ ఈ రంగం పుంజుకోవాలని ఈజిప్టులో పురాతన విషయాలపై అధ్యయనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే, ఈ తవ్వకాలు ప్రధానంగా అకడమిక్ రీసెర్చ్ కంటే కూడా మీడియా దృష్టిని ఆకర్షించేలానే ఉన్నాయని విమర్శకులు చెబుతున్నారు. ఈజిప్టులోని గిజా పిరమిడ్ల వద్ద పెద్ద మ్యూజియం నిర్మాణం వేగంగా పూర్తి చేయాలనీ ఆ దేశం భావిస్తున్నది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios