Heroin Seized: పంజాబ్లో ఎన్కౌంటర్.. భారీ మొత్తంలో హెరాయిన్ స్వాధీనం
Heroin Seized: పంజాబ్ లోని గురుదాస్పుర్ సెక్టార్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 47 కేజీల హెరాయిన్ సీజ్ తో పాటు.. 7 ప్యాకెట్ల నల్లమందు, 2 మ్యాగజైన్లు ఉన్న ఓ చైనీస్ పిస్టల్, ఏకే 47 పిస్టళ్లు సహా ఇతర ఆయుధాలను బీఎస్ఎఫ్ దళాలు సీజ్ చేశాయి.
Heroin Seized: దేశ సరిహద్దుల గుండా భారత్లోకి మాదక ద్రవ్యాలను సరఫరా చేసే పాకిస్థానీ స్మగ్లర్ల ప్రయత్నాలను భారత సైన్యం భగ్నం చేసింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఉద్రికత్త నెలకొనడంతో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో ఒక సైనికుడు మరణించగా.. మరో సైనికుడు గాయపడ్డాడు. ఈ సమయంలో భారీ మొత్తంలో హెరాయిన్ సహా ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకుంది భారత సైన్యం.
వివరాల్లోకెళ్లే.. పంజాబ్ లో ఇవాళ ఉదయం 5.15 నిమిషాలకు ఎన్కౌంటర్ జరిగింది. గురుదాస్పుర్ సెక్టార్ లోని చందూ వాడ్లా పోస్టు వద్ద పాకిస్థాన్ స్మగ్లర్ల కదలికలను గుర్తించింది బీఎస్ఎఫ్. వారిపై కాల్పులు జరిపారు. వారు ప్రతిఘటించగా.. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు ఎన్కౌంటర్ జరిగింది.
ఈ క్రమంలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. మరో జవాను గాయపడ్డాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందిని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి.
ఈ ఎన్కౌంటర్లో సుమారు 47 కేజీల హెరాయిన్ పట్టుకున్నారు. ఏడు ప్యాకెట్లలో ఓపియం, 2 మ్యాగజైన్లు ఉన్న ఓ చైనీస్ పిస్టల్, ఏకే 47 పిస్టళ్లు సహా ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లుబోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉందని బీఎస్ఎఫ్ డీఐజీ తెలిపారు.