ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ విచారణకు కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ అధికారులు ఇవాళ ప్రశ్నిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఆడిటర్ బుచ్చిబాబును శుక్రవారంనాడు ఈడీ ప్రశ్నిస్తుంది. బుచ్చిబాబును ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో బుచ్చిబాబు కీలకంగా వ్యవహరించారని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో పలు దఫాలు బుచ్చిబాబును సీబీఐ అధికారులు ప్రశ్నించారు. బుచ్చిబాబుకు చెందిన గోరంట్ల అసోసియేట్స్ సంస్థలో ఈడీ, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సమయంలో కీలక సమాచారం సేకరించారని సమాచారం.ఈ సమాచారం ఆధారంగా దర్యాప్తు సంస్థలు విచారణ సాగించాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆడిటర్ బుచ్చిబాబును విచారించేందుకు ఈడీకి కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 22న అనుమతిని ఇచ్చింది. దీంతో ఈడీ అధికారులు బుచ్చిబాబును విడతల వారీగా విచారిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన కూడా బుచ్చిబాబును ఈడీ అధికారులు విచారించారు. ఇవాళ కూడా బుచ్చిబాబు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ నెల 16న కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ నెల 16న ఈడీ విచారణకు కవిత విచారణకు హాజరు కాలేదు.
also read:ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు ఈడీ నోటీసులు..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలక పాత్ర పోషించిందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ కేసులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. ఈ నెల 6వ తేదీన అరుణ్ రామచంద్రపిళ్లైని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరుణ్ రామచంద్ర పిళ్లై వాంగ్మూలం ఆధారంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.