'నేను నిర్దోషిని.. అవసరమైతే రాజీనామా చేస్తాం..' :బ్రిజ్ భూషణ్ సింగ్
రెజ్లర్ల నిరసనపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఓ ఆడియోను విడుదల చేశారు.
![Brij Bhushan Singh says Will cooperate with investigation, have faith in judiciary KRJ Brij Bhushan Singh says Will cooperate with investigation, have faith in judiciary KRJ](https://static-ai.asianetnews.com/images/01gq4fz8jztf6xp9pbjqp5a42r/bjp-mp-brij-bhushan-singh-accused-_363x203xt.jpg)
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలపై మహిళా రెజ్లర్లు శుక్రవారం ఢిల్లీ పోలీసులకు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీంతో పాటు ఎంపీ రాజీనామా డిమాండ్ కూడా పెరగడంతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తాజాగా స్పందించారు. ఢిల్లీ పోలీసులపై కూడా తనకు పూర్తి నమ్మకం ఉందని ఎంపీ చెప్పారు.
ఈ ఆరోపణలను ఎదుర్కోవడానికి తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నాననీ, సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తానని అన్నారు. తనకు దర్యాప్తు సంస్థపై పూర్తి నమ్మకం ఉందని, చాలా నెలలుగా తనపై చేస్తున్నారనీ, ఇవి తనను చాలా బాధపెడుతోందని అన్నారు. ఏజెన్సీలు న్యాయమైన విచారణ జరిపి త్వరలో దర్యాప్తు చేస్తుందని ఆశించారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఉన్నారు.
'రాజీనామా పెద్ద విషయం కాదు'
బ్రిజ్ భూషణ్ సింగ్ ఇంకా మాట్లాడుతూ.. ' ఈ విషయంలో ఫెడరేషన్ పాత్ర లేదనీ, కానీ ఆటగాళ్ల డిమాండ్లు మారుతూ ఉంటాయని అన్నారు. వారి డిమాండ్ ప్రకారం రాజీనామా చేయడం అంతా పెద్ద విషయమేమి కాదనీ, తన పదవీకాలం దాదాపు ముగిసిందన్నారు. తాను నేరస్థుడిని కాదన్నారు. అమ్మాయిలకు ఏర్పాట్లు సంబంధించిన ఆడియో ను విడుదల చేశారు.
ఈ సమస్యకు పార్టీకి సంబంధం లేదు
ఇంకా.. బ్రిజ్ భూషణ్ సింగ్ మాట్లాడుతూ.. 'ధర్నాలో కూర్చున్న వారు 15 రోజుల క్రితం వరకు తనని ప్రశంసించారనీ, ఈ కుట్ర వెనుక కాంగ్రెస్ హస్తం ఉందన్నారు. ఆ పరిణామాలను చూస్తేనే అర్థమవుతుందని అన్నారు. నివేదిక వచ్చిన తర్వాత నిజం ఏమిటో దేశానికి కూడా తెలుస్తుందనీ, పోలీసులపై వారికి నమ్మకం లేదనీ, జేపీ క్రాంతిలో చాలాసార్లు జైలుకు వెళ్లానని అన్నారు. అది రామభూమి జన్మ సమస్య కావచ్చు లేదా మరేదైనా ఏదీ నిరూపించబడలేదు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసుననీ, ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మంది రెజ్లర్లు వస్తుంటారని అన్నారు. ఈ అంశానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదనీ, తాను ఎలాంటి ఒత్తిడిలో లేనని అన్నారు. క్లీన్ అండ్ టైడ్ అయిన తర్వాత మళ్లీ కలుస్తానని అన్నారు.
కాగా, రెజ్లర్ సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. 'మేము క్రీడాకారులం , మేము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వము. ఇక్కడికి వచ్చి మా ధర్నాను విచ్చలవిడిగా ఎవ్వరు చేసినా దానికి మేం కాదు ఆయనే బాధ్యులు.అన్నారు.