కాశీ-తమిళనాడు రెండూ సంస్కృతి, నాగరికతకు శాశ్వత కేంద్రాలు: ప్రధాని మోడీ
Varanasi: 'కాశీ తమిళ సంగమం'లో మొత్తం 75 స్టాల్స్ ఏర్పాటు చేశామనీ, ఇది డిసెంబర్ 16 వరకు కొనసాగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఇది వ్యవసాయం, సంస్కృతి, సాహిత్యం, సంగీతం, ఆహారం, చేనేత, హస్తకళలు, జానపద కళల ద్వారా దక్షిణ భారతదేశం-ఉత్తర భారతదేశం మధ్య వారధిగా పనిచేస్తుందని కూడా పేర్కొన్నాయి.
PM Modi in Varanasi: వారణాసిలో 'కాశీ తమిళ సంగమం'ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. శనివారం (నవంబర్ 19) ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 'కాశీ తమిళ సంగమం'ని ప్రారంభించిన తర్వాత తిరుక్కురల్, కాశీ-తమిళ సంస్కృతికి సంబంధించిన పుస్తకాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, నెల రోజుల పాటు జరిగే కాశీ తమిళ సంగమంలో తమిళ సాహిత్యం, విద్య, సంస్కృతి, వంటకాలను ప్రదర్శిస్తుంది. తమిళనాడు నుండి అతిథులు కాశీని, అయోధ్య, ప్రయాగ్రాజ్లను కూడా సందర్శిస్తారు.
కాశీ తమిళ సంగమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. "నదుల సంగమం, జ్ఞానం, ఆలోచనల నుండి మన దేశంలో సంగమం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంగమం భారతదేశ విభిన్న సంస్కృతుల వేడుకగా నిలుస్తుంది" అని అన్నారు. అలాగే, కాశీ, తమిళనాడులు సంస్కృతి, నాగరికతకు శాశ్వతమైన కేంద్రాలని పేర్కొన్నారు. "కాశీ, తమిళనాడు రెండూ సంస్కృతి- నాగరికతకు శాశ్వతమైన కేంద్రాలు. రెండు ప్రాంతాలు ప్రాచీన భాషలైన సంస్కృతం, తమిళాలకు కేంద్రాలు" అని ప్రధాని మోడీ అన్నారు.
కాశీ తమిళ సంగమంలో మొత్తం 75 స్టాల్స్ ఏర్పాటు చేశామనీ, ఇది డిసెంబర్ 16 వరకు కొనసాగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఇది వ్యవసాయం, సంస్కృతి, సాహిత్యం, సంగీతం, ఆహారం, చేనేత, హస్తకళలు, జానపద కళల ద్వారా దక్షిణ భారతదేశం-ఉత్తర భారతదేశం మధ్య వారధిగా పనిచేస్తుందని కూడా పేర్కొన్నాయి. డిసెంబర్ 16 వరకు కాశీ తమిళ సంగమం కార్యక్రమాలు కొనసాగనున్నాయి. కాగా, తమిళనాడులోని శ్రీమద్ మాణిక్కవాచక్ తంబిరాన్, స్వామి శివకర్ దేశికర్, శ్రీశ్రీ సత్య జ్ఞాన మహాదేవ్ దేశిక్ పరమాచార్య స్వామిగల్, శివ ప్రకాష్ దేశిక్ సత్య జ్ఞాన పండర్ సన్నాది, శ్రీ శివజ్ఞాన్ బాలయ్య స్వామిగల్, జ్ఞానప్రకాశ్ దేశికర్, శివలింగేశ్వర స్వామి, కందస్వామి, మాయకృష్ణన్ స్వామి, ముత్తు శివరామస్వామి వంటి తొమ్మిది మంది ప్రముఖ మత పెద్దలను ప్రధాని నరేంద్ర మోడీ సత్కరించనున్నారు.
ఈ కార్యక్రమం రెండు రాష్ట్రాలకు చెందిన పండితులు, తత్వవేత్తలు, కళాకారులు, పరిశోధకులు, విద్యార్థులు, వ్యాపారులు, కళాకారులు మొదలైన వారికి సహకరించడానికి, నైపుణ్యం, సంస్కృతి, ఆలోచనలు, ఉత్తమ అభ్యాసాలు, జ్ఞానాన్ని పంచుకోవడానికి, ఒకరి అనుభవం నుండి నేర్చుకునే అవకాశాన్ని అందిస్తుంది. తమిళనాడు నుండి 2500 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు సెమినార్లు, సైట్ సందర్శనలు మొదలైనవాటిలో పాల్గొనేందుకు వారణాసికి చేరుకున్నారు. కాశీలో నెల రోజుల పాటు చేనేత, హస్తకళలు, ODOP (ఒక జిల్లా, ఒక ఉత్పత్తి) ఉత్పత్తులు, పుస్తకాలు, డాక్యుమెంటరీలు, వంటకాలు, కళారూపాలు, చరిత్ర, పర్యాటక ప్రదేశాలు మొదలైన వాటి ప్రదర్శనలు కూడా కాశీలో ఏర్పాటు చేయబడ్డాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.