కరోనా స్ట్రెయిన్ ఎఫెక్ట్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా టూర్ రద్దు
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా పర్యటన రద్దైంది. కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో యూకేలో మరోసారి లాక్ డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం.
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా పర్యటన రద్దైంది. కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో యూకేలో మరోసారి లాక్ డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం.
ఈ ఏడాదిలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ ఆహ్వానానికి గత నెలలోనే అంగీకరించారు.
ఈ నెల చివర్లో తాను భారత్ ను సందర్శించలేనని భారత ప్రధానితో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడినట్టుగా బ్రిటిష్ వార్తా సంస్థ తెలిపింది.ఈ విషయమై మోడీతో మంగళవారం నాడు ఉదయం ఫోన్ లో మాట్లాడారని ఆ వార్తా సంస్థ ప్రకటించింది.
ఇంగ్లాండ్ లో ఫిబ్రవరి వరకు లాక్ డౌన్ విధిస్తూ బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.
కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ బ్రిటన్ లో గుర్తించారు. బ్రిటన్ నుండి ఇతర దేశాలకు ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. దీంతో ఇప్పటికే బ్రిటన్ చాలా దేశాలు విమానాలను నిషేధించాయి. కరోనా కేసులు పెరిగిపోవడంతో మరోసారి లాక్ డౌన్ విధిస్తూ బ్రిటన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.