పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ హెలిపాడ్ వద్ద బాంబు గుర్తింపు
పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఇంటికి సమీపంలో ఇవాళ బాంబును గుర్తించారు పోలీసులు. ఈ బాంబును నిర్వీర్యం చేశారు పోలీసులు.
చందీఘఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ హెలిపాడ్ వద్ద సోమవారం నాడు బాంబును పోలీసులు గుర్తించారు. వీఐపీలు నివాసం ఉండే ఈ ప్రాంతంలో లైవ్ బాంబును పోలీసులు గుర్తించారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నివాసం కూడా బాంబు గుర్తించిన ప్రాంతానికి సమీపంలోనే ఉంటుంది. పంజాబ్, హర్యానాల సెక్రటేరియట్ , అసెంబ్లీ కూడా బాంబు దొరికిన ప్రదేశానికి సమీపంలోనే ఉన్నాయి.ఈ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కన్సల్ టీ పాయిట్, నయాగావ్ మధ్య మామిడి తోటలో బాంబు షెల్ లభ్యమైంది. పంజాబ్ సీఎం నివాసానికి ఈ ప్రాంతం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.