Asianet News TeluguAsianet News Telugu

నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం.. అసలేం జరిగిందంటే..?   

మహారాష్ట్రలోని పూణెలోని భీమా నది ఒడ్డున ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. 200 నుంచి 300 మీటర్ల దూరంలో మృతదేహాలు లభ్యమయ్యాయి. నాలుగు మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయడం వల్ల నీటమునిగి మరణించినట్లు నిర్ధారించారు.

Bodies Of 7 Family Members Found In Pune Riverbed
Author
First Published Jan 25, 2023, 5:00 AM IST

మహారాష్ట్రలోని పూణె జిల్లాలో నది ఒడ్డున గత ఐదు రోజుల్లో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు మంగళవారం పోలీసులు సమాచారం అందించారు. ప్రాథమిక సమాచారాన్ని ఉటంకిస్తూ.. మృతుల్లో వృద్ధ దంపతులు, వారి కుమార్తె , అల్లుడు , ముగ్గురు మనవరాళ్లు ఉన్నారని పోలీసు అధికారి తెలిపారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

పూణె నగరానికి 45 కిలోమీటర్ల దూరంలోని దౌండ్ తహసీల్‌లోని యావత్ గ్రామ శివార్లలో భీమా నదిపై ఉన్న పర్గావ్ వంతెన సమీపంలో సోమవారం నాలుగు మృతదేహాలు , మంగళవారం మూడు మృతదేహాలు కనుగొనబడినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ఏడు మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవని పోలీసు అధికారి తెలిపారు. వీరిలో ఒక జంట, వారి కుమార్తె , అల్లుడు , వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 200 నుంచి 300 మీటర్ల దూరంలో భీమా నదిలో మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

మృతదేహాలను బయటకు తీశామని తెలిపారు. మృతికి గల కారణాలు, పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య సహా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై పూణె రూరల్ అదనపు ఎస్పీ ఆనంద్ భోయిట్ మాట్లాడుతూ..  భీమా నదిలో మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మృతదేహాలు ఎవరివి అన్న విషయంపై పోలీసులు, స్థానికుల్లో గందరగోళం నెలకొంది. భీమా నదిలో నీటి ప్రవాహంలో వివిధ చోట్ల ఈ మృతదేహాలు లభ్యమయ్యాయి.  ఏడుగురి గల్లంతైనట్లు పోలీసులకు సమాచారం అందింది

దీనిపై పోలీసులు విచారణ చేపట్టి మొబైల్ వివరాలను పరిశీలించగా మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవని తేలింది. పూణే సమీపంలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని పార్నర్‌లోని నిగోజ్ గ్రామంలో 7 మంది తప్పిపోయినట్లు సమాచారం ఉందని, దర్యాప్తు తర్వాత, మృతదేహాల గురించి సమాచారం కనుగొనబడిందని పోలీసులు చెబుతున్నారు. ఈ కుటుంబానికి చెందిన ఓ యువకుడు ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సమాచారం. అతను ఆ మహిళతో ఎక్కడికో వెళ్లిపోయాడు. ప్రస్తుతం పోలీసులు ఈ మొత్తం కేసును విచారిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios