వరద సహాయక చర్యల్లో విషాదం: కాపాడి తీసుకొస్తుండగా.. 9 మంది జలసమాధి
మహారాష్ట్రలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సాంగ్లీ నగరం నుంచి వరద బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా... పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మరణించగా.. పలువురు గల్లంతయ్యారు
మహారాష్ట్రలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నారు.
ఈ క్రమంలో సాంగ్లీ నగరం నుంచి వరద బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా... పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మరణించగా.. పలువురు గల్లంతయ్యారు.
వీరిలో తొమ్మిది మందిని సహాయక బృందాలు రక్షించాయి.. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 30 మంది వరద బాధితులు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.