Asianet News TeluguAsianet News Telugu

అలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెబుతారు: రాహుల్ పై సింధియా ఫైర్  

రాహుల్ గాంధీ పేరు తీసుకోకుండానే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా టార్గెట్ చేశారు. ప్రపంచ వేదికలపై భారతదేశం స్టార్‌గా వెలుగొందుతున్న వేళ కొన్ని పార్టీలు ఆందోళనకు దిగుతున్నాయన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జీ-20కి భారత్ విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చింది. విదేశాలకు వెళ్లి భారత్‌ను విమర్శించే వారికి దేశ ప్రజలు మళ్లీ గుణపాఠం చెబుతారన్నారు.

BJP targets Rahul Gandhi Bharat Mata was criticised on foreign land again KRJ
Author
First Published Sep 12, 2023, 6:09 AM IST

విదేశాల్లో భారత్‌ను విమర్శించే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా విరుచుకుపడ్డారు. ప్రపంచ వేదికలపై భారతదేశం స్టార్‌గా వెలుగొందుతున్నప్పుడు కొన్ని పార్టీలు అశాంతికి గురవుతున్నాయని, కొన్ని సంకుచిత రాజకీయ పార్టీలు అసూయతో ఉన్నాయని అన్నారు. విదేశాలకు వెళ్లి భారత్‌ను విమర్శించే వారిని ప్రజలు గుర్తించారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు

బెల్జియం పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. భారత్‌లో నిరంతరం వాతావరణాన్ని చెడగొట్టే పని చేస్తున్నారని, దేశంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, అయితే ప్రభుత్వం మాత్రం ఏమీ చేయడం లేదు.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన.. మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలను పట్టించుకోవడం లేదని, కొంతమంది ప్రత్యేక వ్యక్తుల మాటలను మాత్రమే వింటుందని అన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని రాహుల్ మళ్లీ అన్నారు. దేశానికి భారత్ అని పేరు పెట్టడంపై కూడా విరుచుకపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios