లోక్ సభలో పూర్తి మెజారిటీ ఉన్న అధికార బీజేపీకి ఇప్పుడు రాజ్యసభలోనూ మెజారిటీ పెరిగింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడికావడంతో ఆ పార్టీకి పెద్దల సభలో మరో ఐదుగురు సభ్యులు పెరిగారు. అయితే కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుస్తుందని అనుకున్నప్పటికీ కేవలం ఒక స్థానానికి పరిమితం అయ్యింది. ఆప్ కూడా ఐదు స్థానాలను గెలుచుకుంది. 

రాజ్య‌స‌భ ఫ‌లితాలు వెల్ల‌డయ్యాయి. మొత్తంగా ఆరు రాష్ట్రాల్లోని 13 స్థానాల‌కు జ‌రిగిన ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను గురువారం ఎన్నిక‌ల క‌మిష‌న్ వెలువ‌రించిది. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో రాజ్య‌స‌భ‌లో బీజేపీ స‌భ్యుల బ‌లం 100కు చేరుకుంది. 1988 తర్వాత ఎగువసభలో 100 మార్కును తాకిన తొలి పార్టీగా బీజేపీ అవతరించింది. 

ఈశాన్య రాష్ట్రాలు అయిన నాగాలాండ్, అస్సాం, త్రిపురలలో ఉన్న మొత్తం నాలుగు స్థానాల్లో కాషాయ పార్టీ విజ‌యం సాధించింది. అలాగే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోనూ బీజేపీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. పంజాబ్‌లో భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పటికే ఐదు రాజ్యసభ స్థానాలను ఏకపక్షంగా కైవసం చేసుకుంది. పంజాబ్ నుండి కొత్త ఆప్ రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, అశోక్ మిట్టల్, సంజీవ్ అరోరా గా ఎన్నిక‌య్యారు. 

కేరళలోని మూడు స్థానాల్లో అధికార ఎల్‌డీఎఫ్‌ రెండు స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎల్‌డీఎఫ్ తరపున డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్‌ఐ) ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎఎ రహీమ్, సీపీఐ కన్నూర్ జిల్లా కార్యదర్శి పి సంతోష్ కుమార్, ప్రతిపక్షాల తరపున కేరళ మహిళా కాంగ్రెస్ చీఫ్ జేబీ మాథర్ ఎన్నికయ్యారు.

త్రిపుర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ మాణిక్ సాహా 40 ఓట్లతో రాష్ట్రంలోని ఏకైక రాజ్యసభ స్థానానికి ఎన్నికయ్యారు, అతని ప్రత్యర్థి అభ్యర్థి, సీపీఐ(ఎం) అభ్యర్థి భాను లాల్ సాహాకు కేవలం 15 ఓట్లు మాత్రమే వచ్చాయి. అధికార బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణంలోని ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT)కి చెందిన ఎమ్మెల్యే ఓటు వేయలేదు.

హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీలో తగినంత సంఖ్య లేకపోవడంతో కాంగ్రెస్ తన అభ్యర్థిని నిల‌బెట్ట‌లేదు. దీంతో బీజేపీ అభ్య‌ర్థి అయిన హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్సి కిందర్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగాలాండ్‌లో BJP నాయకురాలు S Phangnon కొన్యాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, పార్లమెంటు ఎగువ సభలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళా శాసనసభ్యురాలిగా ఆమె గుర్తింపు పొందింది.

అస్సాంలో పరిస్థితి మాత్రం తారుమారు అయ్యింది. ఇక్క‌డి నుంచి బీజేపీ ఒక స్థానం, కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకుంటుంద‌ని అంద‌రూ భావించారు. కానీ క్రాస్ ఓటింగ్ వ‌ల్ల కాంగ్రెస్ ఓడిపోయింది. బీజేపీ రెండు స్థానాల‌ను గెలుచుకుంది. బీజేపీ నాయకురాలు పబిత్రా మార్గెరిటా, దాని మిత్రపక్షమైన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (UPPL) మద్దతుతో Rwngwra Narzary సేఫ్ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి రిపున్ బోరా ఎగువ సభకు రాలేకపోయారు. ఎన్నికలు జరిగిన మొత్తం 13 స్థానాల్లో ఆప్‌, బీజేపీలు చెరో ఐదు, ఎల్‌డీఎఫ్‌ రెండు, కాంగ్రెస్‌ ఒకటి గెలుచుకున్నాయి. విప‌క్షానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఓటు వృథా కావ‌డంతో ఇక్క‌డ బీజేపీ అనూహ్యంగా రెండు స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. మొత్తంగా ఎన్నికలు జరిగిన మొత్తం 13 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు స్థానాలు, అలాగే బీజేపీ ఐదు స్థానాలు గెలుచుకుంది. ఎల్‌డీఎఫ్‌ రెండు స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక స్థానానికే ప‌రిమితం అయ్యింది.