ADR report: భారత ఎన్నికల సంఘం గుర్తించిన 8 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రె్సతో పాటు నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) ఆదాయం రూ.1,373 కోట్లు అని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ADR report) తెలిపింది.
ADR report: భారత ఎన్నికల సంఘం గుర్తించిన ఎనిమిది జాతీయ పార్టీల ఆదాయం రూ. 1,374 కోట్లు అని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) తెలిపింది. ఇందులో ఒక్క బీజేపీనే దాదాపు 55 శాతం మేర వాటాను కలిగి ఉంది. అంటే.. రూ.752.337 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి.. ఆదాయంలో టాప్ లో నిలిచింది.
బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, ఎన్పీపీ వంటి పార్టీల ఆదాయ ఖాతాలు తెరపైకి వచ్చాయి. ఈ పార్టీలన్నీ ఎన్నికల సంఘం నుంచి జాతీయ పార్టీ హోదాను పొందాయి.
2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఎనిమిది జాతీయ పార్టీలు మొత్తం రూ. 1,373.783 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయనీ, ఇందులో బీజేపీ వాటా దాదాపు 55 శాతం అని తెలిపింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) శుక్రవారం నాటి కొత్త నివేదికలో వెల్లడి అయ్యింది.
ఏ పార్టీ ఎంత సంపాదిస్తుంది?
గత ఆర్థిక సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ( బీజేపీ) మొత్తం రూ.752.337 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దేశంలోని అన్ని జాతీయ పార్టీల ఆదాయంలో ఇది 54.76 శాతం. అదే సమయంలో బీజేపీ తన మొత్తం ఆదాయంలో 82.46 శాతం అంటే రూ.620.39 కోట్లు ఖర్చు చేసింది. బీజేపీ తరువాతి స్థానం లో కాంగ్రెస్ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో దీని మొత్తం ఆదాయం రూ.285.765 కోట్లు. దేశంలోని అన్ని జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో కాంగ్రెస్ ఆదాయం 20.80%. కాంగ్రెస్ తన ఆదాయంలో 73.13 శాతం ఖర్చు చేసింది. అంటే రూ.209 కోట్లు. ఇక ఆదాయంలో సీపీఎం మూడో స్థానంలో నిలిచింది. ఈ పార్టీ మొత్తం ఆదాయం 171.046 కోట్లు. ఇందులో ఈ పార్టీ రూ.101.80 కోట్లు ఖర్చు చేసింది.
టీఎంసీ అసమాన వ్యయం
గత ఆర్థిక సంవత్సరంలో మమతా బెనర్జీ పార్టీ TMC ఆదాయం రూ.74.417 కోట్లు. ఈ పార్టీ తన మొత్తం ఆదాయం కంటే ఎక్కువ ఆదాయాన్ని ఖర్చు చేసింది. దాదాపు రూ.132.53 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఆదాయంతో పోలిస్తే.. టీఎంసీ వ్యయం 178 శాతం ఎక్కువ. అదే సమయంలో బీఎస్పీకి మొత్తం రూ. 52.46 కోట్లు. కాగా, తన ఆదాయంలో రూ.17.29 కోట్లు ఖర్చు చేసింది. అంటే, బీఎస్పీ ఆదాయానికి వ్యతిరేకంగా 32.96 శాతం మాత్రమే ఖర్చు చేసింది.
గత ఏడాదితో పోలిస్తే అన్ని పార్టీల ఆదాయాలు డౌన్
జాతీయ పార్టీలు ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన వివరాల ప్రకారం..ఏడీఆర్ నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం.. బీజేపీ ఆదాయం గతేడాదితో పోలిస్తే 79.24 శాతం తగ్గింది. 2019-20లో బీజేపీ మొత్తం ఆదాయం రూ. 3,623.28 కోట్లు కాగా, ఈసారి కేవలం 752.337 కోట్లు మాత్రమే. అలాగే కాంగ్రెస్ ఆదాయం కూడా 58.11 శాతం తగ్గింది. 2019-20లో పార్టీ ఆదాయం రూ.682.21 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.285.765 కోట్లకు తగ్గింది. అలాగే.. ఇతర ఆరు జాతీయ పార్టీల ఆదాయం కూడా తగ్గింది. టీఎంసీ ఆదాయం 48.20 శాతం, ఎన్సీపీ 59.19 శాతం, బీఎస్పీ 9.94 శాతం, సీపీఐ 67.65 శాతం, ఎన్పీపీ 62.91 శాతం మేర తగ్గాయి.