JP Nadda: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి శనివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్ర‌మంలోనే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ నడ్డా, ఆయ‌న భార్య మల్లికా నడ్డా హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లోని విజయపూర్‌ పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు. 

Himachal Pradesh Election 2022: మ‌ళ్లీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా అన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్, గుజ‌రాత్ లో ఏం చేయ‌లేమ‌ని గ్ర‌హించే రాహుల్ గాంధీ ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు. వివ‌రాల్లోకెళ్తే.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి శ‌నివారం ఉద‌యం 8 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్ర‌మంలోనే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ నడ్డా, ఆయ‌న భార్య మల్లికా నడ్డా హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లోని విజయపూర్‌ పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. 

"మేము ఖచ్చితంగా మెజారిటీతో ఉన్నాము. జైరామ్ ఠాకూర్ నాయకత్వంలో ఎన్నికల్లో ముందుకుసాగుతున్నాము.. మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తాం" అని అన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికలకు ప్రచారం చేయకపోవడం గురించి అడిగినప్పుడు.. "వారు కెరీర్‌లో ఉన్న నాయకులు, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో వారు ఏమీ పొందలేరని గ్రహించారు. ఒకసారి వారు గెలుస్తున్నారని లేదా గెలవగలరని భావిస్తే, వారంతా క్రెడిట్ కోసం ఇక్కడకు వస్తారు. వారు ఏమీ పొందలేరని వారికి తెలుసు, కాబట్టి వారు కనిపించరు" అని విమ‌ర్శించారు. హిమాచల్ ప్రదేశ్‌లో పాలక ప్రభుత్వం వరుసగా రెండు పర్యాయాలు నిలదొక్కుకోలేకపోయింది. దీనిపై బీజేపీ సీనియర్‌ నేత మాట్లాడుతూ.. 'ఇది కచ్చితంగా మారుతుందని.. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో చూడగలగడం వల్లే ప్రజలు ఆ సంప్రదాయాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి అక్కడ ఆనంద వాతావరణం నెలకొని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం పునరావృతమ‌వుతుంది" అని అన్నారు.

ఈ ఉద‌యం నుంచి ప్ర‌జ‌ల్లో తాను ఉత్సాహం చూస్తున్నాన‌ని అన్నారు. ప్ర‌జ‌లంద‌రూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని కోరుతున్నాన‌ని జేపీ న‌డ్డా చెప్పారు.

Scroll to load tweet…

68 నియోజకవర్గాల్లో ఓటింగ్

కీలకమైన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓటింగ్ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభ‌మైంది. అంత‌కుముందు ఈవీఎంలను తనిఖీ చేయడానికి అధికారులు అన్ని బూత్‌లలో మాక్ పోల్ నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం (ECI) పంచుకున్న వివ‌రాల ప్రకారం... రాష్ట్రంలో మధ్యాహ్నం 1 గంటల వరకు 37.19 శాతం ఓటింగ్ నమోదైంది. 68 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 55 లక్షల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఈసారి 24 మంది మహిళా అభ్యర్థులు ఎన్నిక‌ల‌ బరిలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లలో 28,54,945 మంది పురుషులు, 27,37,845 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 38 మంది ఉన్నారు. అంత‌కుముందు, పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హిమాచల్ ప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనీష్ గార్గ్ తెలిపారు.