Asianet News TeluguAsianet News Telugu

డబుల్ ఇంజిన్ కాదు, ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం: బీజేపీ పై కాంగ్రెస్ ఫైర్

Dispur: అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా మాట్లాడుతూ హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం రుణాలను పొందడానికి జీడీపీని కృత్రిమంగా పెంచిందని ఆరోపించారు. అలాగే, బీజేపీది డబుల్ ఇంజిన్ కాదు, ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. 
 

BJP government is not a double engine, it is a trouble engine government: Congress on Assam CM Himanta Biswa Sarma RMA
Author
First Published May 27, 2023, 4:44 PM IST

Assam Congress Chief Bhupen Kumar Borah: అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా మాట్లాడుతూ హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం రుణాలను పొందడానికి జీడీపీని కృత్రిమంగా పెంచిందని ఆరోపించారు. అలాగే, బీజేపీది డబుల్ ఇంజిన్ కాదు, ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. 

వివ‌రాల్లోకెళ్తే.. అస్సాం ప్రభుత్వం డబుల్ ఇంజిన్ కాదనీ, ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వమని అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా విమర్శించారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో, అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని బీజేపీ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం ఇచ్చిన పలు హామీలు ఇంకా కార్యరూపం దాల్చలేదని ఏపీసీసీ చీఫ్ విమ‌ర్శించారు. ఉద్యోగాల కల్పనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తప్పుడు హామీలు ఇచ్చారనీ, కానీ చివరికి తన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని భూపేన్ బోరా ఆరోపించారు.

లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వ్యత్యాసాలున్నాయనీ, కానీ వాస్తవానికి వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మొత్తం 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలపై బీజేపీ ప్రభుత్వం జవాబుదారీతనం, వివరణ ఇవ్వాలని భూపేన్ బోరా డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం చేస్తోందని అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. ప్రస్తుత బీజేపీ పాలనలో రాష్ట్ర రుణ భారం గణనీయంగా పెరిగిందని ఆరోపించారు.

2012-13లో రూ.2,757 కోట్లుగా ఉన్న రుణాలు 2021-22 నాటికి రూ.17,149 కోట్లకు పెరిగాయనీ, రానున్న రోజుల్లో అదనంగా మరో రూ.25,000 కోట్ల రుణం పొందే యోచనలో ఉన్నామన్నారు. రుణాలను పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం జీడీపీని కృత్రిమంగా పెంచిందని ఆరోపించిన భూపేన్ బోరా, మరుసటి సంవత్సరంలో రూ .50,000 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదిత ప్రణాళికపై ఆందోళన వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios