ప్రయాణికుడిపై ట్రైన్ టికెట్ కలెక్టర్ల దాష్టీకం.. కింద పడేసి ఇద్దరు అధికారుల దాడి
బిహార్లో ఓ ప్రయాణికుడిపై ఇద్దరు టికెట్ కలెక్టర్లు తమ ప్రతాపం చూపించారు. టాప్ బెర్త్లో కూర్చున్న ప్రయాణికుడిని ఇద్దరు టికెట్ కలెక్టర్లు కిందికి లాగి తీవ్రంగా దాడి చేశారు. బిహార్లోని ముజఫర్పూర్ జిల్లా ఢోలీ సమీపంలో ఈ ఘటన జరిగింది.
పాట్నా: బిహార్లోని ముజఫర్పూర్లో ఓ ట్రైన్లో దారుణం జరిగింది. ఇద్దరు టికెట్ కలెక్టర్లు ఓ ప్రయాణికుడిపై ప్రతాపం చూపించారు. టాప్ బెర్త్లో ఓ ప్రయాణికుడు కూర్చుని ఉన్నాడు. అతడిని టికెట్ కలెక్టర్ కిందికి దిగాల్సిందిగా ఆదేశించాడు. అతనను తిరస్కరించాడు. దీంతో ఓ టికెట్ కలెక్టర్ ఆమె షర్ట్ పట్టుకుని కిందికి లాగాడు. ఆ తర్వాత కాలు పట్టుకుని లాగాడు. ఇంతలో అతనితోపాటే ఉన్న మరో టీసీ కూడా ఆ ప్రయాణికుడి మరో కాలు పట్టుకుని లాగాడు. దీంతో ఆ యువకుడు నేరుగా కిందపడిపోయాడు.
కింద పడిపోయిన ఆ యువకుడిని ఇద్దరు టికెట్ కలెక్టర్లు దారుణంగా కొట్టారు. బూటు కాళ్లతో వారు ఆ ప్రయాణికుడిని ఇష్టమున్న చోట తన్నారు. అతని ముఖంపైనా తన్నడం గమనార్హం. ఈ ఘటన జరుగుతున్నప్పుడు ప్రయాణికులు షాక్ అయ్యారు. కొందరు ఆ ఇద్దరు అధికారులను వారించారు. జోక్యం కలుగజేసుకుని వారిని ఆపారు. దీంతో కింద పడి దెబ్బలుతింటున్న ఆ కొంత ఉపశమనం పొందాడు. ఈ ఘటన ఇదే వారం తొలినాళ్లలలో జరిగింది.
Also Read: రాజస్థాన్లో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. పలువురికి గాయాలు
ఢోలీ రైల్వే స్టేషన్ సమీపంలో ముంబయి నుంచి జైనగర్ కు వెళ్లుతున్నది. జనవరి 2వ తేదీన ఈ ట్రైన్లోకి ఇద్దరు టికెట్ కలెక్టర్లు ఎక్కారు. అందులో ఓ వ్యక్తితో టికెట్ కలెక్టర్కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ ప్రయాణికుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడని కొన్ని కథనాలు తెలిపాయి. అందుకే వారు అతడిని కిందికి దిగాలని చెప్పగా అతను వినలేదు. దీంతో ఒక టికెట్ కలెక్టర్ ఆ వ్యక్తిని కిందకి లాగేశాడు. ప్రయాణికుడు ప్రతిఘటించాడు. కాలును పట్టుకుని కిందికి లాగుతుండగా ఆ ప్రయాణికుడు అదే కాలితో టికెట్ కలెక్టర్ను తన్నాడు. దీంతో ఆ టికెట్ కలెక్టర్ సీరియస్ అయ్యాడు. మాటలూ వేడెక్కాయి. ఇదే సమయంలో మరో టికెట్ కలెక్టర్ కూడా ఆ ప్రయాణికుడిని కిందికి లాగాడు. ఇద్దరు లాగడంతో ఆ ప్రయాణికుడు కింద పడ్డాడు. కింద పడ్డాక వారిద్దరూ తీవ్రంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ ఇద్దరు టికెట్ కలెక్టర్లను వెంటనే సస్పెండ్ చేసినట్టు ఓ రైల్వే ప్రతినిధి తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.