Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి వేడుక నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలోని ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు నదిలో పడిపోవడంతో ఐదుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

Bihar Five as car carrying marriage party falls into river in Navinpur police station area
Author
Patna, First Published May 15, 2022, 4:38 PM IST

బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలోని ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు నదిలో పడిపోవడంతో ఐదుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. 

జార్ఖండ్‌లోని ఛతర్‌పూర్‌లోని సోనూతండ్ ఖతిన్ గ్రామానికి చెందిన లార్డ్ సాహు కుమారుడు ప్రకాష్ కుమార్ పెళ్లి వేడుక శనివారం రాత్రి ఔరంగాబాద్ జిల్లా నబీనగర్ బ్లాక్‌లోని తోల్ పంచాయతీలో జరిగింది. ఈ పెళ్లి ఊరేగింపులో పాల్గొన వరుడి తరఫువారు ఏడుగురు.. వేడుకలు ముగించుకుని ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కారులో పాలము జిల్లాకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు బాఘి గ్రామ సమీపంలో ఉన్న నది వంతెన సమీపంలోకి రాగానే.. అది అదుపు తప్పి రైలింగ్ ఢీకొని వంతెనపై నుంచి కిందకు పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

మృతులను జార్ఖండ్‌లోని పాలము జిల్లా నివాసితులైన రంజిత్ కుమార్, అభయ్ కుమార్, అక్షయ్ కుమార్, శుభం కుమార్, బబ్లు కుమార్‌గా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జౌరంగాబాద్‌కు తరలించారు. మరోవైపు గాయపడినవారిని గంజన్ కుమార్, ముఖేష్ కుమార్‌లుగా గుర్తించారు. వారికి మెరుగైన వైద్యం నిమిత్తం వారణాసికి రిఫర్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios