ఇటీవల భారత్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదాలివే.. వేలాది కుటుంబాల్లో తీరని శోకం..
ప్రతి ఏటా పదుల సంఖ్యలో రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. వందలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. వేలాది మంది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. ఈ ప్రమాదాలు ఎన్నో ఆశలతో, ఊసులతో సాగుతున్న జీవితాల్లో తీరని విషాదాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో భారత్ లో జరిగిన రైలు ప్రమాదాలపై ఓ ప్రత్యేక కథనం
ఒడిశాలోని బాలాసోర్లో శుక్రవారం సాయంత్రం గూడ్స్ రైలును ఢీకొనడంతో కోరమాండల్ ఎక్స్ప్రెస్ నాలుగు కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా మృతి చెందగా, దాదాపు 200 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సోరో, గోపాల్పూర్, ఖంటపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్యకు కూడా పెరిగే అవకాశముంది. రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. రైల్వే ప్రమాదాలు జరగడం కొత్తేమి కాదు. ప్రతి ఏటా పదుల సంఖ్యలో రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ ఘోర ప్రమాదాలు వందలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. వేలాది మంది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. ఈ ప్రమాదాలు ఎన్నో ఆశలతో, ఊసులతో సాగుతున్న జీవితాల్లో తీరని విషాదాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో భారత్ లో జరిగిన రైలు ప్రమాదాలపై ఓ ప్రత్యేక కథనం
ఇటీవల కాలంలో భారత్ లో జరిగిన రైలు ప్రమాదాలివే..
ఛప్రా-మథుర ఎక్స్ప్రెస్ ప్రమాదం
జూలై 7, 2011న ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లా సమీపంలో ఛప్రా-మథుర ఎక్స్ప్రెస్ ఓ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 69 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే క్రాసింగ్ వద్ద సరైనా సెక్యూరిటీ లేకపోవడం వల్ల తెల్లవారుజామున 1:55 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైలు అతివేగంతో నడుస్తుండడంతో బస్సును దాదాపు అర కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లింది.
భారతీయ రైల్వే చరిత్రలో 2012 సంవత్సరం అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం సుమారు 14 ప్రమాదాలు నమోదయ్యాయి.
ఢిల్లీ-చెన్నై ఎక్స్ప్రెస్ ప్రమాదం
జూలై 30, 2012న నెల్లూరు సమీపంలో ఢిల్లీ-చెన్నై తమిళనాడు ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా మరణించారు.
గోరఖ్ధామ్ ఎక్స్ప్రెస్ ప్రమాదం
మే 26, 2014న ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ ప్రాంతంలో గోరఖ్పూర్ వైపు వెళుతున్న గోరఖ్ధామ్ ఎక్స్ప్రెస్ ఖలీలాబాద్ స్టేషన్కు సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. తత్ఫలితంగా 25 మంది మరణించారు.50 మందికి పైగా గాయపడ్డారు.
జనతా ఎక్స్ప్రెస్ ప్రమాదం
మార్చి 20, 2015న డెహ్రాడూన్ నుండి వారణాసికి వెళ్తున్న జనతా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఉత్తరప్రదేశ్ లోని రాయ్బరేలీలోని బచ్రావాన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఇంజన్ తో పాటు రెండు కోచ్లు పట్టాలు తప్పడంతో 30 మందికి పైగా మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారు.
ఇండోర్-పాట్నా ఎక్స్ప్రెస్ ప్రమాదం
నవంబర్ 20, 2016న ఇండోర్-పాట్నా ఎక్స్ప్రెస్ 19321 కాన్పూర్లోని పుఖ్రాయాన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘోర ప్రమాదంలో కనీసం 150 మంది ప్రయాణికులు మరణించగా.. 150 మందికి పైగా గాయపడ్డారు.
కళింగ ఉత్కల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం
ఆగస్టు 19, 2017న హరిద్వార్ నుంచి పూరి మధ్య నడుస్తున్న కళింగ ఉత్కల్ ఎక్స్ప్రెస్ ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లోని ఖతౌలీ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ రైలు ప్రమాదంలో 14 బోగీలు పట్టాలు తప్పడంతో 21 మంది ప్రయాణికులు మృతి చెందగా, 97 మంది గాయపడ్డారు.
కైఫియత్ ఎక్స్ప్రెస్ ప్రమాదం
ఆగస్టు 23, 2017న ఉత్తరప్రదేశ్లోని ఔరైయా సమీపంలో ఢిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తొమ్మిది కోచ్లు పట్టాలు తప్పడంతో 70 మందికి పైగా
గాయపడ్డారు.
బికనీర్-గౌహతి ఎక్స్ప్రెస్ ప్రమాదం
జనవరి 13, 2022న, పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్లో బికనీర్-గౌహతి ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 12 కోచ్లు పట్టాలు తప్పడంతో 9 మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు.