Bhima Koregaon case: ఆ వివాస్పద కేసులో మూడేళ్ల తర్వాత సుధా భరద్వాజ్ విడుదల
భీమా-కోరెగావ్ కేసు (Bhima Koregaon case)లో ఆరోపణలెదుర్కొంటున్నన్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్ విడుదలైంది. దాదాపు మూడేళ్ల జైలు జీవితం తరువాత బైకుల్లా జైలు నుంచి గురువారం విడుదలయ్యారు. ఆమెకు ఎల్గార్ పరిషత్-మావోయిస్ట్ లతో లింకులున్నట్టు ఆరోపణలున్నాయి.
Bhima Koregaon case: భీమా-కోరెగావ్ కేసులో నిందితురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్ ఎట్టకేలకు విడుదలైంది. దాదాపు మూడేళ్ల జైలు జీవితం తరువాత బైకుల్లా జైలు నుంచి గురువారం విడుదలయ్యారు సుధా. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ముంబయిలోని జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు.
ఆమెను ఎల్గార్ పరిషత్-భీమా కోరేగావ్ హింసాకాండ కేసులో 2018 ఆగస్టులో అరెస్టు చేశారు. భరద్వాజ్కు 2021, డిసెంబర్ 1న బాంబే హైకోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 8న ఆంక్షాలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఆదేశాల మేరకు రూ. 50,000 పూచీకత్తుపై ఆమెకు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలు అందిన తర్వాత.. అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని గురువారం మధ్యాహ్నం బైకుల్లా మహిళా జైలు నుంచి బయటకు వచ్చారు సుధా భరద్వాజ్.
ఈ క్రమంలో ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ను అందించారు. తన పాస్పోర్ట్ కోర్టులో సమర్పించాలనీ, ముంబాయి నగరం దాటి వెళ్ల కూడదనీ, ఒక వేళ వెళ్లాల్సి వస్తే.. ప్రత్యేక NIA కోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపింది. ఈ కేసులోని ఇతర నిందితులతో ఎలాంటి సంబంధాలు ఏర్పరచుకోవద్దని, అంతర్జాతీయ కాల్లు చేయవద్దని కూడదనీ కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని ఆంక్షలు విధించింది.
2017, డిసెంబర్ 31న పుణెలోని షానివార్వాడాలోని ఎల్గర్ పరిషద్ కాన్క్లేవ్ వద్ద చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనీ. ఆ తర్వాత రోజే భీమా కోరాగావ్ వార్ మెమోరియల్ వద్ద హింసాత్మక ఘటనలు జరిగాయని పోలీసులు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో సుధా భరద్వాజ్తో పాటు పలువురు హక్కుల నేతలపై కేసు నమోదు చేశారు.
ఈ కేసును తొలుత విచారణ చేట్టిన పుణే పోలీసులు సంచలన నిజాలను వెలుగులోకి తీసుకవచ్చారని తెలిపారు. అలాగే వీరికి మావోయిస్టులతో సంబంధం ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ కేసుపై పలు ఆరోపణలు, రాజకీయా ఒత్తిడి రావడంతో ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు.
దీంతో ఆమెను చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టం(ఉపా) కింద 2018, ఆగస్టులోఅరెస్ట్ చేసింది ఎన్ఐఏ.
హైకోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన క్రమంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఎన్ఐఏ. అయితే, దర్యాప్తు సంస్థ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. భరద్వాజ్కు బెయిల్ అర్హురాలని, అందుకు నిరాకరించటం ఆమె ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమేనని హైకోర్టు పేర్కొంది.
ఇక .. ఈ కేసులో అరెస్టయిన 16 మంది నిందితుల్లో డీఫాల్ట్ బెయిల్ పొందిన వారిలో సుధా భరద్వాజ్ తొలి వ్యక్తి. మరో ఎనిమిది మంది బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. కవి, సామాజిక కార్యకర్త, ఉద్యమకారుడు వరవరరావు ప్రస్తుతం మెడికల్ బెయిల్లో ఉన్నారు. మరో నిందితుడు హక్కుల నేత స్టాన్ స్వామి మెడికల్ బెయిల్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 5న మరణించారు. మిగిలిన వారు అండర్ ట్రయల్గా కస్టడీలో ఉన్నారు.