గెలిచింది మేము.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది వాళ్లు.. : బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్
Madhya Pradesh: తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Bharat Jodo Yatra-Rahul Gandhi: ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలిచింది తామేననీ, అయితే, వాళ్లు (బీజేపీ) ఎమ్మెల్యేలను మాత్రమే కొనుగోలు చేశారంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ బీజేపీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 20-25 మంది అవినీతి ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.
వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలో యాత్రను పూర్తి చేసుకుని ప్రస్తుతం మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బుర్హాన్పూర్లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల్లో తామే గెలుపొందామనీ, మన ప్రభుత్వం ఉందని, అయితే 20-25 మంది అవినీతి ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య మార్గాలన్నీ మూసుకుపోయినందున తాము భారత్ జోడో యాత్రను ప్రారంభించామని చెప్పారు.
"అన్ని ప్రజాస్వామ్య మార్గాలు మూసివేయబడినందున మేము భారత్ జోడో యాత్రను ప్రారంభించాము. లోక్ సభ మూసివేయబడింది, ఎన్నికల మార్గం మూసివేయబడింది. పత్రికా మార్గం కూడా మూసివేయబడింది. అటువంటి పరిస్థితిలో, కాంగ్రెస్ తన స్వరాన్ని పెంచడానికి ఈ ప్రయాణాన్ని ప్రారంభించవలసి వచ్చింది. ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం అణచివేస్తోంది. గళాన్ని పెంచే అన్ని ప్రజాస్వామ్య మార్గాలు ఆగిపోయాయి. మేము ఎన్నికల ద్వారా మాత్రమే ప్రజలకు చేరువకాలేము.. అందుకే ప్రజల్లోకి వెళ్లి వారి తరఫున పోరాటం చేస్తున్నాం" అని రాహుల్ గాంధీ అన్నారు. అలాగే, తమిళనాడు నుంచి ప్రారంభమైన యాత్ర కేరళ మీదుగా మహారాష్ట్రకు చేరుకుందని, ఇప్పుడు మనం మధ్యప్రదేశ్లో ఉన్నామని అన్నారు. కేరళలో లక్షలాది మంది ఈ యాత్రలో చేరారు, ఆ తర్వాత మహారాష్ట్రలోని ప్రజలు కూడా మాతో చేరారు" అని రాహుల్ గాంధీ అన్నారు.
భారతదేశంలో బీజేపీ ద్వేషం, భయం, హింసాత్మక వాతావరణాన్ని సృష్టించిందని రాహుల్ గాంధీ అన్నారు. "మేము పార్లమెంట్లో గొంతు పెంచడానికి ప్రయత్నించినప్పుడు, మా మైక్ ఆగిపోయింది. పత్రికా రంగానికి చెందిన వారు నాకు స్నేహితులని, అయితే వారు నా మాట వినడం లేదని, వారిపై కూడా ఒత్తిడి ఉంది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మేం గెలిచాం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. స్వరం పెంచడానికి అన్ని ప్రజాస్వామ్య పద్ధతులను నిలిపివేశారు. మేము ఒకే ఒక మార్గం మిగిలి ఉంది, నేరుగా రోడ్డుపైకి వెళ్లి ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడం.. అందుకే ప్రజల్లోకి వస్తున్నాం.. వారి సమస్యల కోసం పోరాటం సాగిస్తాం" అని రాహుల్ గాంధీ అన్నారు.