భారత్ జోడ్ యాత్ర: నీట్ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి రాహుల్ గాంధీ పరామర్శ
Bharat Jodo Yatra: ధరల పెరుగుదల, నిరుద్యోగం, మత సామరస్యాన్ని పెంపొందించేందుకు సెప్టెంబర్ 7 నుండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 3,500 కిలో మీటర్ల 'భారత్ జోడో యాత్ర' బుధవారం ప్రారంభమైంది.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర రెండో రోజు ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ మంత్రి ఎంపీ పీ. చిదంబరం, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ తదితరులతో కలిసి కన్యాకుమారిలోని అగస్తీశ్వరంలో పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,570 కి.మీ ప్రయాణంలో తనతో కలిసి నడిచే భారత యాత్రికుల శిబిరం వద్ద రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం నీట్ మెరుగైన ఫలితాలు సాధించలేదనే కారణంతో ఆత్మహత్య చేసుకున్న అనిత కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.
118 మంది 'భారత్ యాత్రికులు' అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీ నాయకులతో కలిసి రాహుల్ గాంధీ ఇక్కడి అగస్తీశ్వరం నుండి పాదయాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతిష్టాత్మకమైన 'భారత్ జోడో' యాత్రను ద్వేషం పెరుగుతోందనీ, దీనికి కేంద్రంలోని బీజేపీ సర్కారే కారణమని ఆరోపిస్తూ విమర్శలు గుప్పించారు. తాను దేశాన్ని నాషనం కానివ్వనని తెలిపారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
2024 లోక్సభ ఎన్నికలకు ముందు సంక్షోభంలో ఉన్న పార్టీ పునరుద్ధరణపై దృష్టి సారించిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ మార్చ్ను సరికొత్త మైలురాయిగా అభివర్ణించారు. ఈ మార్చ్ గ్రాండ్ ఓల్డ్ పార్టీని పునరుజ్జీవింపజేయడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నారు. దాదాపు ఐదు నెలల్లో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. ఉదయం 7 గంటల నుంచి 10:30 గంటల వరకు, మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు రెండు బ్యాచ్లుగా పాదయాత్ర సాగనుంది. ఉదయం సెషన్లో తక్కువ మంది పాల్గొనేవారు ఉండగా, సాయంత్రం సెషన్లో జన సమీకరణ కనిపిస్తుంది. పాల్గొనేవారు ప్రతిరోజూ 22-23 కిమీ చుట్టూ నడవాలని ప్లాన్ చేసుకున్నారు. 'భారత్ యాత్రికులు'లో దాదాపు 30 శాతం మంది మహిళలు. భారత్ యాత్రికుల సగటు వయస్సు 38గా ఉంది. యాత్రలో పాల్గొనేందుకు దాదాపు 50,000 మంది పౌరులు కూడా నమోదు చేసుకున్నారు.
సెప్టెంబరు 11న కేరళకు చేరుకున్న తర్వాత, యాత్ర తదుపరి 18 రోజుల పాటు రాష్ట్రం గుండా ప్రయాణించి, సెప్టెంబర్ 30న కర్ణాటకకు చేరుకుంటుంది. ఉత్తరాదికి వెళ్లే ముందు 21 రోజుల పాటు కర్ణాటకలో ఉంటుంది. ఇది తిరువనంతపురం, కొచ్చి, నిలంబూర్, మైసూరు, బళ్లారి, రాయచూర్, వికారాబాద్, నాందేడ్, జల్గావ్, ఇండోర్, కోట, దౌసా, అల్వార్, బులంద్షహర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్కోట్, జమ్మూ మీదుగా శ్రీనగర్లో ముగుస్తుంది.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని కలిసిన తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్.. భారతదేశ ఆత్మను వెలికితీసేందుకు రాహుల్ గాంధీ ప్రయాణం ప్రారంభించారని అన్నారు.