జాతీయ ప్రజా ఉద్యమంగా భారత్ జోడో యాత్ర.. : బీజేపీపై మల్లికార్జున ఖర్గే విమర్శలు
New Delhi: భారత్ జోడో యాత్రకు లక్షలాది మంది మద్దతు, విశ్వాసం లభిస్తోంది. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వీడియో సందేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, యాత్రలో యువత, రైతులు, సమాజంలోని అణగారిన వర్గాలు, మహిళలు, మాజీ సైనికుల నుంచి కాంగ్రెస్కు మద్దతు లభిస్తోందని అన్నారు.
Congress Bharat Jodo Yatra: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త భారత్ జోడో యాత్రకు మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర జాతీయ ప్రజా ఉద్యమంగా మారిందని అన్నారు. అన్ని వర్గాల నుంచి రాహుల్ గాంధీ పాదయాత్రకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భారత్ జోడో యాత్ర జాతీయ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుందని అన్నారు. భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తిచేసుకుందన్నారు. భారత్ జోడో యాత్రకు లక్షలాది మంది మద్దతు, విశ్వాసం లభిస్తోంది. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వీడియో సందేశంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, యాత్రలో యువత, రైతులు, సమాజంలోని అణగారిన వర్గాలు, మహిళలు, మాజీ సైనికుల నుంచి కాంగ్రెస్కు మద్దతు లభిస్తోందని అన్నారు. దీంతో పాటు రాహుల్ స్వయంగా ప్రజలతో మాట్లాడుతున్నారని అన్నారు. కాగా, మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం రాజస్థాన్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు.
ప్రధానంగా మూడు అంశాల్లో యాత్ర దేశాన్ని ఏకం చేస్తోందని మళ్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. మొదటిది షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు-మైనారిటీలపై పెరుగుతున్న అఘాయిత్యాల దృష్ట్యా సమాజంలో వ్యాప్తి చెందుతున్న ద్వేషానికి వ్యతిరేకంగా, ఈ అఘాయిత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పడం. గత ఎనిమిదేళ్లలో దేశం నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో పోరాడుతోంది. దేశంలో రాజకీయ నియంతృత్వ కాలం వచ్చిందనీ, అధికార దాహంతో కూడిన బీజేపీ రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. అందరూ బీజేపీ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. భారత్ జోడో యాత్ర ఇప్పుడు జాతీయ ప్రజా ఉద్యమంగా మారిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. రాబోయే సంవత్సరాల్లో, మనమందరం భారతదేశానికి కొత్త ఊపును, దిశను అందించగలమని తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.
డిసెంబర్ 24న ఢిల్లీలోకి భారత్ జోడో యాత్ర..
కాగా, రాహుల్ గాంధీ నాయకత్వంలోని దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర డిసెంబరు 24న ఢిల్లీలోకి ప్రవేశించి సుమారు ఎనిమిది రోజుల విరామం తర్వాత ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, చివరకు జమ్మూ కాశ్మీర్ వైపు సాగుతుంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. పూజా భట్, రియా సేన్, స్వర భాస్కర్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరి, అమోల్ పాలేకర్ వంటి సినీ-టీవీ ప్రముఖులు యాత్రలో పాల్గొన్నారు. మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్ ఎల్ రామదాస్, శివసేనకు చెందిన ఆదిత్య థాకరే, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే సహా రచయితలు, ఆర్మీ అధికారులు, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వంటి ప్రతిపక్ష నేతలు కూడా యాత్రలో చేరారు.