Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ప్రజాదరణపై బీజేపీ ఆందోళన.. కేరళకు చేరుకున్న భారత్ జోడో యాత్ర
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు అపారమైన ఆదరణ లభిస్తుందన్న ఆందోళన నేపథ్యంలో బీజేపీ, పనికిమాలిన, అర్థరహితమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.
Bharat Jodo Yatra-Rahul Gandhi: కాంగ్రెస్ దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. అయితే, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అపారమైన ఆదరణ లభిస్తుందన్న ఆందోళనలో బీజేపీ, పనికిమాలిన, అర్థరహితమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగనున్న ఈ భారత్ జోడో యాత్ర ఆదివారం నాడు కేరళకు చేరుకుంది. అంతకుముందు యాత్రకు స్వాగతం పలికేందుకు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు కేరళ-తమిళనాడు సరిహద్దులోని పరసాల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే యాత్రకు, రాహుల్ గాంధీకి లభిస్తున్న ప్రజాదరణపై బీజేపీ ఆందోళన చెందుతున్నదనీ, అందుకే పనికిమాలిన అంశాలను లేవనెత్తుతున్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. “యాత్ర ప్రారంభంలో వారు (బీజేపీ) కంటైనర్ల గురించి మాట్లాడింది. ఆ తరువాత రాహుల్ గాంధీ చొక్కా, బూట్ల గురించి మాట్లాడింది. రేపు ఇది మరికొన్ని పనికిమాలిన అంశాలను లేవనెత్తుతుంది’’ అని తిరువనంతపురం జిల్లాలోని నెయ్యట్టింకరలో పార్టీ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. పనికిమాలిన దాడికి దేశ హోంమంత్రి నాయకత్వం వహిస్తున్నారని కూడా ఆరోపించారు.
అయితే, ఇప్పటివరకు బీజేపీ ఆ విమర్శలపై స్పందించలేదు. కానీ, అంతకుముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ మాజీ చీఫ్ ఖరీదైన విదేశీ టీ-షర్ట్ ధరించి దేశాన్ని ఏకం చేయడానికి బయలుదేరాడు అంటూ ఎగతాళి చేశారు. భారతీయ జనతా పార్టీ అంతకుముందు ఒక ట్వీట్లో "అతను ధరించిన బుర్బెర్రీ టీ షర్టు ధర ₹ 40,000 కంటే ఎక్కువ ఉంటుంది" అని ఆరోపించింది.
“మేము మా యాత్రను ఇప్పుడే ప్రారంభించాము. అయితే దానికి లభిస్తున్న అపూర్వమైన స్పందనపై బీజేపీ నిజంగా ఆందోళన చెందుతోంది. దాని నాయకుల ప్రతిచర్యల నుండి మనం దానిని అంచనా వేయవచ్చు. ప్రధాని మోడీలా తన దుస్తులకు ప్రజాధనాన్ని ఖర్చు చేయడం లేదని రమేష్ అన్నారు. అసంబద్ధమైన మాటలు మాట్లాడవద్దని బీజేపీకి సూచించిన ఆయన.. మోడీ ₹ 10 లక్షల విలువైన సూట్, బూట్ల గురించి దేశం ఇంకా మరచిపోలేదని అన్నారు. యాత్రలో లేవనెత్తిన నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక ధృవీకరణ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరగాలని బీజేపీకి సూచించారు. “భారత్ జోడో యాత్ర ప్రజలను తిరిగి కనెక్ట్ చేసే ప్రయత్నం.. పార్టీని పునరుద్ధరించే ప్రయత్నం. ఇది మాట్లాడే యాత్ర కాదు.. ప్రజల మాటలు వినే ప్రయత్నం. ఇది మోడీ ఏకపాత్రాభినయం మన్ కీ బాత్లా కాకుండా, యునైటెడ్ కింగ్డమ్లోని కన్జర్వేటివ్ పార్టీ తర్వాత ప్రపంచంలోని రెండవ అత్యంత పురాతన పార్టీ ప్రజల మాటలను వినడం.. గత ఏడేళ్లలో బీజేపీ చేసిన నష్టాలను రద్దు చేయడం అనే లక్ష్యంతో ఉందని ఆయన అన్నారు.
త్వరలో జరగనున్న సంస్థాగత ఎన్నికలపై పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ను మీడియా ప్రశ్నించగా.. ఇది సజావుగా సాగుతుందని చెప్పారు. “కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ, డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుడు కూడా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు. ఎన్నికల ముందు పార్టీ పెను సంక్షోభంలో కూరుకుపోతుందన్న వాతావరణాన్ని ఓ వర్గం మీడియా సృష్టిస్తోంది' అని అన్నారు. మీడియా సమావేశంలో సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, పావెన్ ఖేరా, ఆ పార్టీ కేరళ చీఫ్ కె సుధాకరన్, రాష్ట్ర ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ తదితరులు పాల్గొన్నారు.
“ప్రజల ఉత్సాహాన్ని మీరు చూడవచ్చు. యాత్రికులు-వారి నాయకుడిని పలకరించడానికి వారు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ యాత్ర పార్టీకి తాజా శక్తిని అందించడానికి.. పార్టీ అవకాశాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది” అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యులు శశి థరూర్ అన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి వచ్చే ఎన్నికల గురించి మీడియా అడిగినప్పుడు, దాని గురించి మాట్లాడటం చాలా తొందరగా ఉందని, అయితే ప్రజాస్వామ్య ప్రక్రియ పార్టీని బలోపేతం చేస్తుందని తాను భావిస్తున్నానని అన్నారు. పార్టీ ఎన్నికల అధికారి మధుసూదన్ మిస్త్రీకి తాను లేఖ రాసింది ఘర్షణ కోసం కాదనీ, వివరణ కోరడానికేనని ఆయన పునరుద్ఘాటించారు. ఐదుగురు పార్టీ ఎంపీలు రాసిన ప్రయివేటు లెటర్ లీక్ అయ్యిందనీ, మిస్త్రీ సమాధానంతో తాను సంతృప్తి చెందానని పేర్కొన్నారు.
కేరళలో యాత్రకు ఘన స్వాగతం...
ఆదివారం తెల్లవారుజామున, రాష్ట్ర రాజధాని తిరువనంతపురంకు దక్షిణాన 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడు-కేరళ సరిహద్దు పట్టణం పరసాల వద్ద వేలాది మంది ప్రజలు భారత్ జోడో యాత్రకు స్వాగతం పలకడానికి వచ్చారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి తరలి రావడంతో పరిస్థితులను అదుపు చేయడంలో నిర్వాహకులు, భద్రతా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. "ప్రజల స్పందన చూసి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యాత్ర కొత్త అధ్యాయానికి తెరతీస్తుంది. ద్వేషం, విభజన రాజకీయాలకు ముగింపు పలుకుతుంది" అని పార్టీ అధికార ప్రతినిధి షామా మహ్మద్ అన్నారు. వచ్చే 18 రోజుల్లో కేరళలోని మొత్తం విస్తీర్ణాన్ని కవర్ చేస్తామని ఆమె చెప్పారు. కాగా, యాత్ర పూర్తి అయ్యే వరకు ఉంగే యాత్రికులలో 120 సగటు వయస్సు 38 సంవత్సరాలుగా ఉండగా, వారిలో 30 శాతం మంది మహిళలు ఉన్నారు. సెప్టెంబరు 14న కొల్లం జిల్లాలోకి ప్రవేశించనున్న యాత్ర సెప్టెంబర్ 17న అలప్పుజకు చేరుకుని సెప్టెంబర్ 21, 22 తేదీల్లో ఎర్నాకులం జిల్లా మీదుగా సెప్టెంబరు 23న త్రిసూర్ చేరుకుంటుంది. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో పాలక్కాడ్ మీదుగా సెప్టెంబర్ 28న మలప్పురంలో ప్రవేశిస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.