జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం: తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైంది వీరే..!
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారు. వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులు వున్నారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులను పురస్కారాలకు ఎంపిక చేసింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారు. వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులు వున్నారు. తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా ఎంపీపీఎస్ సావర్ఖేడ్ యాక్టింగ్ హెచ్ఎం రంగయ్య, సిద్దిపేట ఇందిరానగర్ జడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ రామస్వామి ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ లింగరాజుపాలెం హైస్కూల్ ఉపాధ్యాయుడు భూషణ్ శ్రీధర్, చిత్తూరు ఐరాల పాయిపల్లి హైస్కూల్ ఉపాధ్యాయుడు మునిరెడ్డిని అవార్డుకు ఎంపిక చేశారు.