Bengaluru floods: భారీ వరదల మధ్య దోసల ప్రమోట్.. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై ట్రోల్స్ !
Bengaluru floods: బెంగళూరులో భారీ వర్షాల కారణంగా వరదలు పొటెత్తాయి. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. అయితే, బెంగళూరు సౌత్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అవేవి పట్టించుకోకుండా దోసను ప్రమోట్ చేస్తున్నారని ట్రోల్స్ మొదలయ్యాయి.
Bengaluru floods: నగరంలోని అనేక ప్రాంతాలు కుండపోత వర్షాలు, వరదలతో అల్లాడుతున్నప్పుడు, బెంగళూరు సౌత్ లోక్సభ సభ్యుడు, బీజేపీ నాయకుడు తేజస్వి సూర్య తన నియోజకవర్గంలో దోసె రుచిగా ఉందంటూ.. తినుబండారాన్ని ప్రమోట్ చేశారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఎందుకంటే బెంగళూరును వరదల ముంచెత్తి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్గా మారిన 40 సెకన్ల వీడియోలో, బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు పద్మనాభనగర్లోని ఓ తినుబండారంలో 'బట్టర్ మసాలా దోస, ఉప్పిట్టు' (ఉప్మా) తింటూ, దాని నాణ్యత, రుచిని ప్రశంసించడం చూడవచ్చు. అక్కడికి వచ్చి అక్కడి ఆహారాన్ని రుచి చూడమని ప్రజలకు సూచించాడు.ఆ వీడియోను ఎప్పుడు చిత్రీకరించారనే ప్రస్తావన లేదు.
— Lavanya Ballal (@LavanyaBallal) September 6, 2022
అయితే, కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ లావణ్య బల్లాల్ మాట్లాడుతూ, ఈ వీడియో సెప్టెంబర్ 5 నాటిదని, నగరంలోని చాలా ప్రాంతాలు వరదలు ముంచెత్తాయని చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే బీజేపీ నాయకుడు ఇలా ప్రమోషన్లలో బీజీ ఉన్న తీరుపై విమర్శలు గుప్పించారు. “సెప్టెంబర్ 5 తేదీ వీడియో. @Tejasvi_Surya బెంగుళూరు మునిగిపోతున్నప్పుడు మంచి బ్రేక్ ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక్క వరద ప్రభావిత ప్రాంతాన్ని అయినా సందర్శించారా? అని బల్లాల్ ట్వీట్ చేశారు. “@తేజస్వి_సూర్య, అతని సహచరుల నుండి ఎవరైనా విన్నారా? అతను బెంగుళూరులో ఉన్నాడా?" అని ఆమె మరో ట్వీట్లో పేర్కొన్నారు. నటి, మాజీ కాంగ్రెస్ ఎంపీ రమ్యతో సహా పలువురు ట్విట్టర్ వినియోగదారులు సూర్య వీడియోను ఆన్లైన్లో పంచుకున్నారు.
నటి, మాజీ కాంగ్రెస్ ఎంపీ రమ్యతో సహా పలువురు ట్విట్టర్ వినియోగదారులు సూర్య వీడియోను ఆన్లైన్లో పంచుకున్నారు. “ఫుడ్ బ్లాగర్ @Tejasvi_Surya అవారే, మీరు ఇతర హోటళ్లను ప్రమోట్ చేయాలనుకుంటే, ORRలో కాఫీ కోసం కలుద్దాం బెంగళూరు సౌత్కు చెందిన మీ ఓటర్లు అక్కడ పనిచేస్తున్నారు” అని ఓ ట్విట్టర్ వినియోగదారు తెలిపారు. "రోమ్ కాలిపోయినప్పుడు, నీరో ఫిడేల్ వాయించాడు ! బెంగళూరు మునిగిపోయినప్పుడు, @ తేజస్వి_సూర్య దోసెలు తిని, అధికారంలోకి వచ్చిన ప్రజలను ఎగతాళి చేశాడు ! మీరు తదుపరి ఓటు వేసేటప్పుడు ఈ చిత్రాన్ని.. అతని చిరునవ్వును గుర్తుంచుకోండి! ” ఆప్ నేత పృథ్వీ రెడ్డి అన్నారు.
తేజస్వి సూర్యను విమర్శిస్తూ.. ఒక ట్వీట్ ఇలా ఉంది, “ఎంపీ పేరు: @తేజస్వి_సూర్య నియోజకవర్గం: బెంగళూరు సౌత్ * గత 3 రోజుల్లో కేజ్రీవాల్పై ట్వీట్లు: 240 * రాహుల్ గాంధీపై ట్వీట్లు: 17 * ఇందిరా గాంధీ, నెహ్రూపై ట్వీట్లు: 55 * మోడీని ప్రశంసిస్తూ ట్వీట్లు: 137 *బెంగళూరు వరదలపై ట్వీట్లు: 00*”. మరికొంత మంది తేజస్వి సూర్య కనిపించకుండా పోయారంటూ ట్వీట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. చాలా ట్వీట్లు సూర్యను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, బీజేపీకి చెందిన మరో ఇద్దరు బెంగళూరు ఎంపీలు సదానంద గౌడ (ఉత్తర), పిసి మోహన్ (సెంట్రల్) కూడా బెంగళూరులో వర్ష బీభత్సానికి సంబంధించి ఎలాంటి ట్వీట్లు ఎందుకు పోస్ట్ చేయలేదని కొందరు ప్రశ్నించారు. భారీ వర్షాలు, వరదల మధ్య నగర ఎమ్మెల్యేలు, రాజకీయ వర్గాలను నిందిస్తూ అనేక మంది ట్వీట్లు చేశారు.