కొత్త బాయ్ఫ్రెండ్తో తిరుగుతన్నదని.. మహిళపై మాజీ ప్రేమికుడి దాడి
Bengaluru: కొత్త బాయ్ఫ్రెండ్తో తిరుగుతున్నందుకు ఒక మహిళపై మాజీ ప్రేమికుడు, అతని స్నేహితులు దాడి చేశారు. మంగళవారం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది.
Ex-lover, friends attack woman: కొత్త బాయ్ఫ్రెండ్తో తిరుగుతున్నందుకు ఒక మహిళపై మాజీ ప్రేమికుడు, అతని స్నేహితులు కలిసి దాడి చేశారు. మంగళవారం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. దీనిని సుమోటో కేసు తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరు ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తేూ.. బాలేకుండ్రి సర్కిల్ సమీపంలోని ఇన్ఫాంట్రీ రోడ్డులో సోమవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు ఓ మహిళపై, ఆమె ప్రేమికుడిపై దాడి చేశారు. అటుగా వెళ్తున్న వారి వాహనాన్ని ఆపి వారిపై దాడి చేశారు. రాత్రి 9 గంటలకు అక్కడి ప్రజల దృష్టికి వచ్చేలా జరిగిన ఈ గొడవ దాదాపు 10 నిమిషాల పాటు జరిగింది. ఈ క్రమంలోనే అటుగా దారిన వెళ్లే ఒక వ్యక్తి ఈ ఘటనను తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మహిళ, అతని బాయ్ ఫ్రెండ్ పై జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే పోలీసుల దృష్టికి రావడంతో విధానసౌధ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారికి కోసం వెతికారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం నాటికి, పోలీసులు శివాజీనగర్ నివాసి, ఫుడ్ డెలివరీ ఉద్యోగి కార్తీక్ను అరెస్టు చేశారు. ఈ దాడికి పాల్పడింది మహిళ మాజీ ప్రేమికుడు. అలాగే, అతని స్నేహితులు సంజయ్నగర్ నివాసి పవన్, జేజే నగర్కు చెందిన శరత్లు అని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణను వివరాలను వెల్లడించిన పోలీసులు.. మహిళకు ఇదివరకే పవన్తో పరిచయం ఉందని తెలిపారు. ఇదివరకు వారు ఇద్దరు సన్నిహితంగా ఉన్నారనీ, ఆ తర్వాత వారి మధ్య దూరం పెరిగిందని పోలీసులు తెలిపారు.
సోమవారం రాత్రి తన స్కూటర్పై శివాజీనగర్ పరిసర ప్రాంతాల్లో మహిళ, ఆమె ప్రేమికుడు తిరుగుతుండగా.. కార్తీక్ గమనించి పవన్ను ఈ విషయం గురించి చెప్పాడు. "బాలెకుండ్రి సర్కిల్ వద్ద ఉన్న పబ్ దగ్గర తన కోసం వేచి ఉండాల్సిందిగా పవన్ ఆ మహిళకు ఫోన్ చేసి.. శరత్తో కలిసి పవన్ ఆ ప్రదేశానికి చేరుకున్నారు. పవన్, కార్తీక్, శరత్లు తనను ఆపి.. వేరే వ్యక్తితో కలిసి తిరుగుతున్నందుకు మహిళను వేధించడం ప్రారంభించారు. ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆమె బాయ్ఫ్రెండ్ దానిని ఆపడానికి ప్రయత్నించాడు. దీంతో తర్వాత ముగ్గురూ అతనిపై దాడి చేశారు. మహిళ జోక్యం చేసుకోవడంతో ఆమెపై కూడా దాడి జరిగింది" అని పోలీసులు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి పోలీసులు మహిళ ఫిర్యాదును స్వీకరించి ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు.
కాగా, అంతకుముందు ఈ ఘటన జరుగుతున్న పరిస్థితులపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో యువకులు ఒక జంటపై దాడి చేశారు. దాడికి పాల్పడిన వారి వద్ద కత్తులు కూడా ఉన్నాయనీ, దీంతో స్థానికులు వారికి సాయం అందించడానికి భయపడ్డారని పేర్కొన్నారు. ఒక జర్నలిస్టుతో సహా అనేక మంది వ్యక్తులు పోలీసు కంట్రోల్ రూమ్ను సంప్రదించడానికి చేసిన అనేక ప్రయత్నాలు ఫలించలేదు, ఎందుకంటే నంబర్ (112) బిజీగా ఉంది. విధానసౌధ పోలీసు ఇన్స్పెక్టర్కు ఫోన్ చేయగానే 30 నిమిషాలు ఆలస్యంగానైనా హొయసల గస్తీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని తెలిపారు.