రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలో లింగాయత్ల భారీ నిరసన ప్రదర్శన
Belagavi: తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలో లింగాయత్లు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. లింగాయత్ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్.. పార్టీ సీనియర్ నాయకులు బీఎస్ యడియూరప్ప, బీఎస్ బొమ్మైలకు వ్యతిరేకంగా గళమెత్తారు.
Lingayats Stage Massive protest: తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలో లింగాయత్లు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. లింగాయత్ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్.. పార్టీ సీనియర్ నాయకులు బీఎస్ యడియూరప్ప, బీఎస్ బొమ్మైలకు వ్యతిరేకంగా గళమెత్తారు.
వివరాల్లోకెళ్తే.. కర్ణాటక జనాభాలో దాదాపు 17 శాతం ఉన్న అగ్రవర్ణ లింగాయత్ గ్రూపు ఉప విభాగం పంచమసాలి లింగాయత్ కమ్యూనిటీకి చెందిన లక్ష మందికి పైగా సభ్యులు గురువారం బెలగావిలోని సువర్ణ సౌధ నుండి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భారీ సంఖ్యలో లింగాయత్ సభ్యులు, నాయకులు పాలుపంచుకున్నారు. లింగాయత్ సాధువులు, బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ పార్టీ సీనియర్ నాయకులు బీఎస్ యడియూరప్ప, బీఎస్ బొమ్మైలపై గళమెత్తారు.
లింగాయత్ జనాభాలో 70 శాతం ఉన్న పంచమసాలి లింగాయత్లు లింగాయత్ సమాజంలో పెద్ద భాగాన్ని ఏర్పాటు చేసినప్పటికీ తమకు చాలా అవసరమైన రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వలేదని పేర్కొన్నారు. గతంలో ముంబయి-కర్ణాటక ప్రాంతంగా పిలువబడే కిట్టూరు కర్ణాటక ప్రాంతంలో 100 కి పైగా స్థానాలను ప్రభావితం చేసే శక్తి వారికి ఉంది. ఇందులో దాదాపు 7 జిల్లాలు ఉన్నాయి. కిట్టూరు కర్ణాటక ప్రాంతంలో ఉత్తర కన్నడ, బెల్గావి, గదగ్, ధార్వాడ్, విజయపుర, బాగల్కోట్, హవేరిలు ఉన్నాయి. ఓబీసీ కోటాలోని 3బీ కేటగిరీ నుంచి 2ఏ కేటగిరీలో చేర్చాలని పంచమసాలి లింగాయత్ లు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం 5 శాతంగా ఉన్న ఉద్యోగ కోటాను 15 శాతానికి పెంచాలని వారు కోరుతున్నారు. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు, రిజర్వేషన్ల అంశం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తలనొప్పిగా మారింది, ఎందుకంటే కర్ణాటకలోని ఓబీసీల్లోని అనేక వర్గాలు కూడా తమ రిజర్వేషన్ కోటాను పెంచాలని కోరుతున్నాయి. పంచమసాలీలు, వొక్కలిగలు, మరాఠాలతో సహా అనేక వర్గాలు తమ రిజర్వేషన్ల కోటాను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటకలో షెడ్యూల్డ్ కులాలు (15 శాతం నుంచి 17 శాతం), షెడ్యూల్డ్ తెగలకు (3 శాతం నుంచి 7 శాతానికి) రిజర్వేషన్లను పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే తమ రిజర్వేషన్లు సైతం పెంచాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పలు వర్గాలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టడానికి సిద్ధమవుతున్నాయి.
రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 16 శాతం, ఎస్టీలు 6.9 శాతం ఉన్నారు. కర్ణాటక శాశ్వత వెనుకబడిన తరగతుల కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి తన మధ్యంతర నివేదికను సమర్పించింది. కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి జయప్రకాశ్ హెగ్డే నివేదికను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి సమర్పించారు. కమిషన్ నివేదిక ఆధారంగా వారి డిమాండ్లపై తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం బొమ్మై చెప్పారు. కర్ణాటకలో ఆధిపత్య లింగాయత్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ ఉప విభాగం పంచమశాలి లింగాయత్లు రిజర్వేషన్ల కోసం ప్రారంభించిన దాదాపు రెండు సంవత్సరాల ఆందోళన గురువారం బెళగావిలోని రాష్ట్ర శాసనసభకు కవాతు చేయాలని వందలాది మంది కార్యకర్తలు ప్రతిపాదించడంతో తీవ్ర రూపం దాల్చింది. కాగా, నేడు జరిగే మంత్రివర్గంలో సంబంధిత అంశంపై చర్చించే అవకాశముందని సమాచారం.