బాసర ట్రిపుల్ ఐటీలో మూడు రోజులుగా కనిపించకుండా పోయిన బన్నీ అనే విద్యార్థి సెల్ ఫోన్ లాస్ట్ లొకేషన్ మహారాష్ట్రలో దొరికింది.
బాసర : బాసర ట్రిపుల్ ఐటీలో అదృశ్యమైన బన్నీ అనే సెకండ్ ఇయర్ విద్యార్థి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. బన్నీ సెల్ ఫోన్ లాస్ట్ లొకేషన్ మహారాష్ట్రలో చూపిస్తోంది. మహారాష్ట్రలోని పూర్ణ పట్నంలో లొకేషన్ చూపించడంతో పోలీసులతోపాటు తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు. కాగా వీరు వెళ్లేసరికి బన్నీ అక్కడినుంచి వెళ్లిపోయాడు.
పూర్ణలోని ఓ లాడ్జ్ లో రూం తీసుకుని ఉన్నాడని.. గతరాత్రి వెళ్లిపోయాడని తెలిసింది. ఈనెల 6న అవుట్ పాస్ తీసుకుని బాసర ట్రిపుల్ ఐటీ హాస్టల్ నుంచి బయటికి వెళ్లిన బన్నీ అనే విద్యార్థి ఇంటికి చేరకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. దీంతో అతని మిస్సింగ్ మరింత మిస్టరీగా మారింది. బాసర నుండి మహారాష్ట్రకు ఎందుకు వెళ్లాడు? అక్కడేం చేస్తున్నాడు? ఇప్పుడు అక్కడినుంచి ఎక్కడికి వెళ్లాడు? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
నాలుగో తరగతి విద్యార్థి దారుణ హత్య.. అర్థరాత్రి హతమార్చిన గుర్తు తెలియని దుండగులు...
ఇదిలా ఉండగా, బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. బాసర ట్రిపుల్ ఐటీలోబన్ని అనే విద్యార్థి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడే హాస్టల్ ఉంటున్న బన్నీ మూడు రోజులనుంచి కనిపించకుండా పోయాడు. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన బన్ని మిస్సయ్యాడు. అతని ఫోన్ కూడా స్విఛాఫ్ చేసి ఉంది.
విషయం తెలిసిన తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారినుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మూడు రోజులుగా బన్నీ ఫోన్ చేయకపోవడం..తాము ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుండడంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఆదివారం నాడు హాస్టల్ కు వచ్చి ఆరాతీశారు.
కాగా, బన్నీ ఇంటికి వెడుతున్నానని చెప్పి మూడు రోజుల క్రితమే హాస్టల్ నుంచి వెళ్లినట్టుగా యాజమాన్యం తెలిపింది. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు.. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా పంపుతారని యాజమాన్యాన్ని నిలదీసింది. బన్నీ ఎక్కడికి వెళ్లాడో తెలియకపోవడం.. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం.. ఇంటికి వెడుతున్నాని చెప్పి బయల్దేరడంతో తల్లిదండ్రులు భయాందోళనల్లో ఉన్నారు.
