DGCA: ఇకనుంచి విమానాల్లో మాస్క్ మస్ట్.. డీజీసీఏ ఆదేశాలు
DGCA: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కమర్షియల్ ఎయిర్లైన్స్ విమానాల్లో కఠినమైన కరోనావైరస్ ప్రోటోకాల్లను పాటించాలని DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) సూచించింది. ప్రయాణికులు కోవిడ్ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూడాలని విమానయాన సంస్థలను చట్టబద్ధమైన సంస్థ కోరింది.
DGCA: భారత్ లో మరోసారి కరోనా విజృంభిస్తుంది.కేసుల సంఖ్య క్రమంగా.. వేగవంతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అప్రమత్తమైంది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా.. విమానాలలో ప్రయాణీకులకు మాస్క్లు తప్పనిసరి చేసింది.
అలాగే.. COVID-19 ప్రోటోకాల్లను అనుసరించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) బుధవారం అన్ని భారతీయ విమానయాన సంస్థలను కోరింది. ఖచ్చితంగా పాటించాలి. అలా చేయకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అంతే కాకుండా ప్రయాణికులను శానిటైజ్ చేయాలి. విమానాశ్రయాల్లో కరోనా టెస్టులు చేయాలని డీజీసీఏ నిర్ణయించింది.
ప్రయాణీకుల ఆకస్మిక తనిఖీ - DGCA
విమానంలో ప్రయాణీకులు మాస్క్లు ధరించేలా చూడాలని విమానయాన సంస్థలను కోరింది, పెరుగుతున్న COVID కేసుల దృష్ట్యా ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA ఈ రోజు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా ప్రయాణీకులు సూచనలను పాటించకపోతే, ఆ ప్రయాణికుడిపై విమానయాన సంస్థ కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ఎయిర్పోర్టులు, ఎయిర్లైన్స్లో ప్రయాణికులను ఆకస్మికంగా తనిఖీ చేస్తామని డీజీసీఏ తెలిపింది.
అంతకు ముందు.. జూన్లో ఏవియేషన్ రెగ్యులేటర్ ఉత్తర్వులు జారీ చేస్తూ, అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే ఫేస్ మాస్క్లను తొలగించవచ్చని, ఏదైనా కారణం చేత అనుమతి మంజూరు చేయబడుతుందని పేర్కొంది. ఈ క్రమంలో విమానాశ్రయాలపై నిఘా పెంచాలని కూడా కోరింది. అంతే కాకుండా మాస్క్లు లేకుండా ఎవరైనా ప్రవేశించడంపై కూడా నిషేధం విధించింది. విమానాశ్రయం లోపల ప్రముఖ ప్రదేశాలలో శానిటైజర్ల ఏర్పాటుతో సహా తగిన పరిశుభ్రత చర్యలు కూడా సూచించబడ్డాయి.
బుధవారం దేశవ్యాప్తంగా 9,062 కొత్త కోవిడ్ -19 కేసులు రావడంతో మొత్తం ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య 4,42,86,256కి చేరుకోగా, చికిత్సలో ఉన్న రోగుల సంఖ్య 1,05,058కి తగ్గింది. ఇదిలాఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు 1 నుండి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. శనివారం నుండి ప్రతిరోజూ ఐదు కంటే ఎక్కువ కోవిడ్ సంబంధిత మరణాలను నమోదు చేస్తోంది. దేశ రాజధానిలో పక్షం రోజుల్లో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య దాదాపు రెండు రెట్లు పెరిగింది.
ఢిల్లీ స్టేట్ హెల్త్ బులెటిన్ గణాంకాలు ప్రకారం.. ఆగస్టు 1 నుండి ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య పైపైకి చేరుతుంది. ప్రస్తుతం కేసుల సంఖ్య 588కి పెరిగింది. 205 మంది ఆక్సిజన్ సపోర్ట్లో, 22 మంది వెంటిలేటర్ సపోర్ట్లో ఉన్నారు. ICU అడ్మిషన్లు ఆగస్టు 1న 98 నుండి ఆగస్టు 16 నాటికి 202కి రెట్టింపు అయ్యాయి.