Asianet News TeluguAsianet News Telugu

ముంచెత్తిన హిమపాతం.. ఇద్దరు విదేశీయుల మృతి..

జమ్మూకశ్మీర్‌ లోని బారాముల్లా జిల్లాలో భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు విదేశీయులు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అదేసమయంలో 19 మంది విదేశీయులను, ఇద్దరు స్థానిక గైడ్స్‌ని సహాయక సిబ్బంది కాపాడింది.  

Avalanche Warning In 4 Kashmir Districts After 2 Foreigners Killed At Ski Resort
Author
First Published Feb 2, 2023, 12:14 AM IST

ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్‌ను బుధవారం భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో చాలా మంది సమాధి అయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఇందులో ఇద్దరు విదేశీయుల (స్కీయర్స్) మృతదేహాలను మంచు కింద నుంచి బయటకు తీయగా, మరో 19 మంది విదేశీ పౌరులు రక్షించబడ్డారు.

వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుల్‌మార్గ్‌లోని ప్రసిద్ధ స్కై రిసార్ట్ కూడా హిమపాతానికి గురైంది. హిమపాతం సంభవించినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని భారీ సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను బయటకు తీశారు. అదే సమయంలో 19 మందిని రక్షించారు.  

గత ఆదివారం, లడఖ్ ప్రాంతంలోని  టాంగోల్ గ్రామంలో హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు మరణించారు.  తంగోల్ గ్రామం కార్గిల్ నుండి 78 కి.మీ దూరంలో జనాస్కర్ హైవేపై వస్తుంది. గత కొన్ని రోజులుగా మంచు కురుస్తున్న నేపథ్యంలో పర్వతాలపై భారీగా మంచు పేరుకుపోయింది. అదే సమయంలో రానున్న రోజుల్లో మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని,  దట్టమైన మంచు ప్రాంతాల నుండి దూరంగా ఉండాలని పరిపాలన హెచ్చరిక జారీ చేసింది.

కిష్త్వార్ జిల్లాలో హిమపాతం 

శుక్రవారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని మారుమూల పద్దర్ ప్రాంతంలో హిమపాతం సంభవించింది. అయితే ఇందులో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. జమ్మూ కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో హిమపాతం హెచ్చరిక జారీ చేసినట్లు పరిపాలన తెలిపింది. మెకెల్ బెల్ట్‌లోని ఒక గ్రామానికి సమీపంలో మంచు నదిలోకి జారిపోయింది, అయితే గ్రామం ఆ ప్రాంతానికి దూరంగా ఉన్నందున ఎటువంటి నష్టం జరగలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios