Asianet News TeluguAsianet News Telugu

ఔరంగజేబు మథుర శ్రీకృష్ణ దేవాలయాన్ని కూలగొట్టాడు - ఆగ్రా పురావాస్తు శాఖ

మథురలోని శ్రీకృష్ణ దేవాలయాన్ని మొఘల్ పాలకుడు ఔరంగజేబు కూల్చివేశాడని ఆగ్రా పురావస్తు శాఖ స్పష్టం చేసింది. మెయిన్‌పురికి చెందిన అజయ్ ప్రతాప్ సింగ్ ఆర్టీఐ ద్వారా సమాచారం కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Aurangzeb Demolishes Mathura Sri Krishna Temple - Agra Archeology Department..ISR
Author
First Published Feb 4, 2024, 8:48 AM IST

శ్రీ కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంలో పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది. మొఘల్ పాలకుడు ఔరంగజేబు మథురలో ఆ ఆలయాన్ని పడగొట్టి మసీదును నిర్మించాడని తేలింది. ఆర్టీఐ ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఆలయాన్ని కూల్చివేసిన తర్వాత ఔరంగజేబు నిర్మించిన మసీదు స్థలంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించినట్లు ఆగ్రా పురావస్తు శాఖ ఆర్టీఐలో పేర్కొంది.

మెయిన్‌పురికి చెందిన అజయ్ ప్రతాప్ సింగ్ ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) కింద దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల సమాచారాన్ని కోరారు. ఇందులో మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలానికి సంబంధించిన సమాచారాన్ని అడిగారు. దీనిపై భారత పురావస్తు శాఖ స్పందించింది. బ్రిటీష్ హయాంలో 1920లో ప్రచురితమైన గెజిట్ ఆధారంగా వివరాలను వెల్లడించింది. మసీదు స్థానంలో అంతకుముందు కత్రా కేశవదేవ్ ఆలయం ఉందని ఉందని, దానిని నిర్మించి మసీదు నిర్మించారని పేర్కొంది. 

దీనిపై కృష్ణ జన్మభూమి ముక్తి న్యాస్ అధ్యక్షుడు, న్యాయవాది మహేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ.. బ్రిటిష్ హయాంలో పనిచేసిన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ బిల్డింగ్ అండ్ రోడ్ సెక్షన్ ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాలలో ప్రచురించిన గెజిట్‌లో నమోదు చేసిన 39 స్మారక చిహ్నాల జాబితా ఉందని తెలిపారు. ఈ జాబితాలో కత్రా కేశవ్ దేవ్ భూమి వద్ద ఉన్న శ్రీ కృష్ణ భూమి 37వ స్థానంలో పేర్కొని ఉందని అన్నారు. ఇంతకు ముందు కత్రా గుట్టపై కేశవ్ దేవ్ ఆలయం ఉండేదని అందులో ఉందని, దానిని కూల్చివేసి, మసీదును కట్టారని తెలిపారు. 

ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ స్పష్టం చేసిందని, దీనిని  సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో దీన్ని సాక్ష్యంగా పొందుపరుస్తామని చెప్పారు.  1920 గెజిట్‌లో కిలియార్ గురించి ప్రస్తావించబడింది. కత్రా కేశవ్ దేవ్ ఆలయం 39 స్మారక చిహ్నాలలో 37వ స్థానంలో నమోదు చేయబడిందని తెలిపారు. ఈ విషయం చాలా స్పష్టంగా ఉందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios